Breaking News

కర్నూలులో కలకలం.. రైల్వే ట్రాక్‌పై నలుగురి మృతదేహాలు


జిల్లాలో ఘోరం వెలుగుచూసింది. రైల్వే ట్రాక్‌పై నలుగురు మృతదేహాలు పడి ఉండడం తీవ్ర కలకలం రేపింది. పాణ్యం సమీపంలోని కౌలూరు గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. రైలు ఢీకొనడంతో మృతదేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. ప్రమాదవశాత్తూ రైలు కింద పడి చనిపోయారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. సంఘటన స్థలంలో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా మృతులను నంద్యాలలోని రోజాకుంట వాసులుగా పోలీసులు గుర్తించారు. అబ్దుల్ సలాం, అతని కుటుంబ సభ్యులుగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:


By November 03, 2020 at 02:06PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/four-bodies-found-on-railway-track-in-kurnool/articleshow/79016824.cms

No comments