Breaking News

ట్రంప్ ఓడారంతే, ఆయన నా శత్రువు కాదు.. తొలి ప్రసంగంతో ఆకట్టుకున్న బెడైన్


అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. ట్రంప్‌పై తిరుగులేని మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు.. దీంతో సంబరాలు మొదలయ్యాయి. గెలుపు తర్వాత బెడైన్ తొలిసారి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ గెలుపు అమెరికన్లదని.. ప్రజలు ఆశించిన పాలన అందిస్తామన్నారు. అమెరికన్లు తమ భవిష్యత్ కోసం ఓటేశారని.. 7.4 కోట్లమంది అమెరికన్లు డెమోక్రాట్లకు ఓటేశారని.. పూర్తి ఆధిక్యంతో విజయం సాధించామన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయను, నిలబెట్టుకుంటాను అన్నారు. సంపూర్ణ విజయం అందించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా చరిత్రలో తొలి ఉపాధ్యక్షురాలైన కమలా హారీస్‌కు బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలోనూ పార్టీ విజయం కోసం పనిచేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ ఓడిపోయారు, తాను కూడా ఒకటి, రెండు ఎన్నికల్లో ఓడిపోయాను అన్నారు. ఎన్నికల్లో ఓడినా ట్రంప్ తనకు శత్రువు కాదు అన్నారు. ఇక ఎన్నికలు ముగిశాయి.. సరికొత్త అమెరికా నిర్మాణంలో ట్రంప్ కూడా కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. అమెరికాను వర్ణ వివక్ష లేకుండా అభివృద్ధి చేసుకుందామన్నారు బైడెన్. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎంతైనా కష్టపడతానని.. ఇక నుంచి అమెరికాలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు.


By November 08, 2020 at 07:52AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/i-pledge-to-be-a-president-who-seeks-not-to-divide-but-to-unify-says-joe-biden-after-grand-victory/articleshow/79107661.cms

No comments