Breaking News

పంది, గొడ్డు మాంసం కోసం కొట్టుకున్న ఎంపీలు.. రణరంగమైన పార్లమెంట్!


ప్రజాప్రతినిధులమని విచక్షణ మరిచి చట్టసభలోనే సభ్యులు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్న ఘటన తైవాన్ పార్లమెంట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మాంసం, పిడిగుద్దులతో ఎంపీలు దాడి చేసుకున్నారు. అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై పార్లమెంటులో చర్చ జరుగుతుండగా ఈ ఘటన ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. దిగుమతులపై అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన చర్చ తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఫలితంగా అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒకరిపై ఒకరు మాంసం ముద్దలు విసురుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో ఒక్కసారిగా పార్లమెంట్ రణరంగాన్ని తలపించింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి పంది మాంసం దిగుమతిపై ఆగస్టులో నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన నివేదికను ప్రీమియర్‌ సు సెంగ్‌-చాంగ్‌ పార్లమెంట్‌ సభ్యులకు వివరిస్తుండగా ప్రతిపక్ష నేషనలిస్ట్ పార్టీ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. అప్పటికే ప్రతిపక్ష సభ్యులు పంది మాంసంతో కూడిన బ్యాగులను సభలోనికి తీసుకురావడం గందరగోళం నెలకుంది. దీన్ని అధికార పార్టీ సభ్యులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుని, పంది మాంసంతో పరస్పరం దాడి చేసుకున్నారు. నేలపై దొర్లిపడి కొట్టుకున్నారు. పంది, గొడ్డు మాంసం దిగుమతిపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తైవాన్‌లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తైపీలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. అయితే, అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తైవాన్‌ అధ్యక్షుడు సాయ్ ఇంగ్ వెన్ ప్రకటించారు. ప్రస్తుతం నిషేధం కొనసాగుతుండగా జనవరి నుంచి గొడ్డు మాంసం దిగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయనున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పంది మాంసం వినియోగం కొద్ది శాతం ఉంటుంది, కానీ, ఎన్నికలలో వరుసగా విఫలమైన తరువాత మద్దతును సమీకరించే ప్రయత్నంలో ప్రతిపక్ష నేషనలిస్ట్ పార్టీ ఈ సమస్యను భుజాలకెత్తుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమెరికా పంది మాంసం దిగుమతులను వ్యతిరేకించారు.. ఇప్పుడు అధికారంలో ఉన్న మీరు అక్కడ నుంచి పంది మాంసం దిగుమతికి మద్దతు ఇస్తున్నారు’అని కేఎంటీ సభ్యుడు లిన్ వీ-చౌ అన్నారు. ఈ విధానాన్ని నిరసిస్తూ చట్టసభలో నిరసన తెలిపామని అన్నారు. నల్ల రంగు టీ షర్టులు ధరించి నిరసన తెలిపారు.


By November 28, 2020 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/lawmakers-throw-pig-guts-punches-on-taiwan-parliament-on-yesterday/articleshow/79457451.cms

No comments