వంతెనపై అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన వాహనం.. ఏడుగురు దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్లో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గాయపడ్డారు. మండీ జిల్లా పులఘ్రాట్ సుకేతీ ఖేడ్ నది వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. వంతెన రైలింగ్ను ఢీకొట్టిన వాహనం అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. దీంతో వాహనంలోని ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురు మృతిచెందగా.. ప్రస్తుతం ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలోని చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం మండీ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. వేగంగా వచ్చిన వాహనం వంతెనపై ఉన్న రైలింగ్ను ఢీకొట్టి నదిలోని దూసుకెళ్లిందని, దీంతో అందులోని ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పై నుంచి దూసుకెళ్లడంతో వాహనం పూర్తిగా ధ్వంసమయ్యింది. మృతదేశాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, వివరాల గురించి ఆరాతీస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
By November 16, 2020 at 10:57AM
No comments