Breaking News

బీహార్‌లో రెండో విడత పోలింగ్‌ ప్రారంభం


బీహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా చెబుతున్న రెండో దశకు 94 స్థానాలకు 17 జిల్లాల్లో మొత్తం 41,362 పోలింగ్‌ కేంద్రాలు.. భారీ భద్రత ఏర్పాటు చేశారు. రెండో దశలో కీలక నేతలు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌(రాఘోపుర్‌), ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ (హసన్‌పుర్‌)‌లలో పోలింగ్‌ జరుగుతోంది. ఇటు నీతీష్ సర్కార్‌లో మంత్రులుగా ఉన్న బీజేపీ నేత నంద్‌ కిశోర్‌ యాదవ్‌(పట్నా సాహెబ్‌), బీజేపీ నేత రాణా రణ్‌ ధీర్‌ సింగ్ (మధుబన్‌), జేడీయూ నేత శ్రవణ్‌కుమార్‌ (నలంద), జేడీయూ నేత రామ్‌సేవక్‌ సింగ్‌ (హథువా)లు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 28న తొలి విడతలో 71 స్థానాలకు 53.4శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 1066 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నేడు రెమండో విడత పోలింగ్ జరుగుతుండగా.. మూడో విడత నవంబరు 7న జరగనుంది. ఈ నెల 10న ఫలితాలు వెల్లడిస్తారు. బీహార్‌ రెండో విడతతో పాటూ దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలు, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, జార్ఖండ్‌, కర్ణాటక, నాగాలాండ్‌, ఒడిశాల్లో స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ జరుగుతోంది.


By November 03, 2020 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-assembly-elections-second-phase-voting-begins/articleshow/79011170.cms

No comments