Breaking News

జో ఓ గజినీ, ఏడాది కంటే ఎక్కువ కాలం పాలించలేరు.. షోను నడిపేది కమలాయే: బాలీవుడ్ నటి


ఇటీవల కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై తరుచూ విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి .. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌ను ఓ గజినీగా అభివర్ణించిన ఆమె ఆయన ఏడాది కంటే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేరని పేర్కొంది. ఇదే సమయంలో కమలా హ్యారిస్‌పై కంగన్ ప్రశంసలు కురిపించింది. అంతేకాదు, గజినీ బైడెన్‌ స్థానంలో కమలా షోను నడిపిస్తారని కంగన్ పేర్కొన్నారు. ‘ప్రతీ ఐదు నిమిషాలకు ఒకసారి అన్ని విషయాలనూ మరిచిపోయే గజినీ లాంటి బైడెన్‌‌కు చికిత్స, ఔషధాలు ఇచ్చినా ఏడాది కన్నా ఎక్కువ కాలం అధ్యక్షుడిగా కొనసాగలేరు.. మొత్తం షోను నడిపిస్తారు.. ఓ మహిళ ఎదిగితే, మహిళలందరూ ఎదిగేలా ఆమె కృషి చేస్తారు.. ఏది ఏమైనా ఇది ఎంతో చరిత్రాత్మక రోజు’ అని కంగన ట్వీట్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. కమల, బైడెన్‌ది ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతం.. వారిద్దరూ మంచి పాలన అందిస్తారు.. బైడెన్‌ లాంటి గౌరవనీయ వ్యక్తిని తక్కువచేసి మాట్లాడొద్దు’ ఓ వ్యక్తి బదులిచ్చారు. ఆయన యోగ్యత కారణంగా ప్రజలు జోను ఎన్నుకున్నారు.. వారిద్దరూ గొప్ప టీం తయారు చేస్తారు. నేను నిన్ను అభినందిస్తున్నాను కాని దయచేసి అలాంటి గౌరవప్రదమైన వ్యక్తిని కించపరచవద్దు అని మరో వ్యక్తి మండిపడ్డారు. ఇటువంటివి రాసే ముందు ఆలోచించాలి.. ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారు, రాజకీయ భావజాలం, తత్వం, ఉద్దేశాలు ఒకటే... ఒక మహిళగా మీరు ఆమెను రోల్ మోడల్‌గా చేసుకోండి.. గజిని అని ఎలా అంటారు’ ఇంకొకరు కౌంటర్ ఇచ్చారు.


By November 09, 2020 at 10:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/actress-kangana-ranaut-controversial-comments-about-joe-biden-victory/articleshow/79122203.cms

No comments