Breaking News

రిగ్గింగ్‌తోనే బైడెన్ గెలిచాడు.. నేను ఒప్పుకోను: మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు


అధికార బదలాయింపు విషయంలో మొండిగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు .. ఎన్నికల ఫలితాలపై పాతపాటే పాడుతున్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్‌‌కు పాల్పడ్డటంతోనే బైడెన్ గెలుపొందారని ఆరోపించారు. మీడియా ఫేక్‌ కథనాల్లోనే బైడెన్‌ గెలిచారని, దీన్ని తాను అంగీకరించబోనని ట్రంప్‌ తాజాగా ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఫలితాలపై ప్రయాణం ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘ఆయన () గెలిచాడు.. ఎందుకంటే ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు’ అంటూ ఓ ట్వీట్ చేశారు. ‘ఆయన మీడియా తప్పుడు కథనాలతోనే విజయం సాధించారు.. దీనిని నేను అంగీకరించను.. ఇవి రిగ్గింగ్ ఎన్నికలు.. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’ అంటూ మరో ట్వీట్‌లో ఆరోపించారు. నవంబరు 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు, ట్రంప్ మద్దతుదారులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. మాగా మిలియన్ మార్చ్ పేరుతో వాషింగ్టన్‌లో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు భారీ నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసి.. హింసాత్మకంగా మారాయి. ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడగా.. వీరిలో పోలీసులు కూడా ఉన్నారు. ట్రంప్‌నకు మద్దతుగా వేలాది మంది రాజధాని వాషింగ్టన్‌లో నిరసన ర్యాలీ చేపట్టారు. వీరిలో ‘ప్రౌడ్‌ బాయ్స్‌’, యాంటిఫా వంటి కన్సర్వేటివ్‌ గ్రూప్‌‌లు ఉన్నాయి. వీరి ప్రత్యర్థి వర్గం ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ఓ సందర్భంలో తారసపడటంతో ఒకరికొకరు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఈ సమయంలో బాహాబాహీకి దిగిన వీరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. తనకు మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించిన వేళ ట్రంప్.. మరోసారి ఎన్నికల ఫలితాలపై విమర్శలు గుప్పించడం విశేషం.


By November 16, 2020 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-elections-donald-trump-concedes-defeat-and-says-elections-was-rigged/articleshow/79240572.cms

No comments