Breaking News

విశాఖలో దారుణం.. నడిరోడ్డుపై యువతి గొంతుకోసిన యువకుడు


విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమోన్మాది చేసిన దాడిలో యువతి మృతి చెందింది. గాజువాక సుందరయ్య కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరలక్ష్మీ అనే విద్యార్థి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటుు కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. అదే ప్రాంతానికి చెందిన అఖిల్ సాయి బి.ఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నిన్న సాయంత్రం అఖిల్ సాయి,తన మిత్రుడు రామ్ తో కలిసి యువతిని స్థానిక సాయిబాబా గుడివద్దకు పిలిచారు. వరలక్ష్మీ అక్కడికి వెళ్లగానే ప్రేమ వ్యవహారంలో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గొడవ తారస్థాయికి చేరుకోవడంతో అఖిల్,తనవెంట తెచ్చుకున్న కత్తితో యువతి మెడపై దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే బాధితురాలిని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది. అఖిల్ సాయిని అదుపులోకి తీసుకోగా,అతని స్నేహితుడు రామ్ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Read More: బెజవాడలో దివ్య తేజస్వినిపై ప్రేమోన్మాది దాడి ఘటన మరువక ముందే.. ఇలా విశాఖలో మరో యువతిపై దాడి జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. .ప్రేమోన్మాదుల పైశాచికానికి యువతులు బలైపోతున్నారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎన్నిచట్టాలు చేస్తున్నా ఉన్మాదుల దాడులు మాత్రం ఆగడం లేదు.


By November 01, 2020 at 07:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-cut-throat-of-young-girl-in-vishakhapatnam/articleshow/78977107.cms

No comments