Breaking News

పుట్టినరోజు నాడే 12ఏళ్ల బాలుడు సూసైడ్.. కారణం ఇదే


తల్లిదండ్రులు మందలించారని పుట్టినరోజు నాడే ఓ 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. నవంబరు 24న ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు మందలించడంతోనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొన్నారు. అడిషినల్ డిప్యూటీ కమిషనర్ రణ్‌విజయ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నొయిడాలోని సెక్టార్ 18‌లో ఆ బాలుడి కుటుంబం నివాసం ఉంటోంది. నవంబరు 24న బాలుడి పుట్టిన రోజు కాగా.. అదే రోజు ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. పుట్టిన రోజు నాడే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు బాలుడి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేశామని వెల్లడించారు. కుటుంబసభ్యులు మందలించడంతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నామని అన్నారు. కేసు విచారణ జరుగుతోందని, దర్యాప్తులో వాస్తవాలు బయటపడతాయని ఏడీసీపీ సింగ్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు చేసే అతిగారాబం కొన్నిసార్లు అనర్ధాలకు కారణమవుతోంది. పిల్లలు కోరుకోవడమే తడువు ఆఘమేఘాల మీద కొనిస్తారు. వారిని బుజ్జగించడానికి చేసే ప్రయత్నాలు పెడదారిని పట్టిస్తే మరికొందరి ప్రాణాలు సైతం తీస్తోంది. తాము కోరినవి దక్కించుకోవాలన్న పంతంతో తల్లిదండ్రులను బెదిరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారి పంతం నేరవేరినా.. అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం ఈ బాలుడి విషయంలోనూ అదే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.


By November 26, 2020 at 11:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/12-year-old-boy-found-dead-on-birthdaypolice-suspect-suicide-in-noida/articleshow/79422593.cms

No comments