మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. వీడియోలు తీసి.. జగిత్యాలలో దారుణం
తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అమానుషంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేప్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటికి పొక్కినట్లు తెలుస్తోంది. ఈ అత్యంత దారుణ ఘటన జిల్లాలో జరిగింది. మెట్పల్లికి చెందిన బాలిక(14) కన్నేసిన కామాంధులు నీచానికి ఒడిగట్టారు. బాలికను తీసుకెళ్లి ఐదుగురు కీచకులు దారుణంగా అత్యాచారం చేశారు. ఆ దారుణాన్ని వీడియోలు తీసి భద్రపరిచినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటికి వచ్చింది. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. Also Read:
By October 25, 2020 at 11:49AM
No comments