చైనా యాప్తో నిందితుడి ఫోన్ కాల్స్.. మహబూబాబాద్ మర్డర్ కేసులో షాకింగ్
దీక్షిత్ కిడ్నాప్, మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీ కోసమే మంద సాగర్ అనే మెకానిక్ బాలుడిని కిడ్నాప్ చేసి చంపేసినట్లు పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. అయితే బాలుడిని కిడ్నాప్ చేసిన గంటలోనే హత్య చేసిన సాగర్.. ఆ తరువాత బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. నిందితుడి ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇంటర్నెట్ కాల్స్ చేయడంతో నిందితుడి ఆచూకీ గుర్తించడంలో ఆలస్యమైంది. కాల్స్ చేసేందుకు నిందితుడు ఉపయోగించిన యాప్ గురించి తెలుసుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాల్స్ చేసేందుకు వినియోగించిన యాప్ గురించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ‘డింగ్ టాక్’ అనే యాప్ ద్వారా నిందితుడు ఫోన్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. డింగ్ టాక్ నుంచి ఇంటర్నెట్ కాల్స్ చేయడంతో నిందితుడి ఆచూకీ గుర్తించడం కష్టతరమైంది. ఏంటీ డింగ్టాక్.. డింగ్ టాక్ ఓ చైనా యాప్. సంస్థల్లో కమ్యూనికేషన్ (ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్) కోసం ఈ యాప్ను చైనాలో ఎక్కువగా వినియోగిస్తారని తెలుస్తోంది. చైనాలో వంద మిలియన్లు( పది కోట్లు) మంది ఈ యాప్ను వాడుతున్నట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్లు ఈ యాప్ వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ను చైనా ఆన్లైన్ దిగ్గజం అలీబాబా అభివృద్ధి చేసింది. ఆడియో, వీడియో కాల్స్, కాన్ఫరెన్స్లు నిర్వహించే సదుపాయం ఉంది. మనదేశంలో ఈ యాప్ వినియోగం అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్.. బాలుడి కిడ్నాప్, మర్డర్ కేసు విచారణను మహబూబాబాద్ పోలీసులు వేగవంతం చేశారు. అందులో భాగంగా క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. నిందితుడు సాగర్ని వెంటబెట్టుకుని బాలుడిని హత్య చేసిన ప్రదేశానికి వెళ్లి వివరాలు రాబట్టినట్లు సమాచారం. మహబూబాబాద్ శివారు దానవాయి గుట్టపై బాలుడి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. నిందితుడిని గుట్టపైకి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం. Also Read:
By October 23, 2020 at 11:27AM
No comments