Breaking News

భారత భూభాగంలోకి పాక్ క్వాడ్‌కాప్టర్.. సకాలంలో గుర్తించి కూల్చివేసిన సైన్యం


జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. దాయాది నిరంతరం కవ్వింపు చర్యలకు పాల్పుడుతూ, ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. అయితే, పాక్ దుశ్చర్యలను భారత సైన్యం సమర్ధంగానే తిప్పికొడుతూ తగిన గుణపాంఠం చెబుతోంది. తాజాగా, నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలో ఎగురుతున్న పాక్‌కు చెందిన క్వాడ్‌ కాప్టర్‌ను వద్ద శనివారం ఉదయం భద్రతా బలగాలు కూల్చివేశాయి. చైనా సంస్థ తయారు చేసిన డీజీఐ మావిక్‌ 2 ప్రో మోడల్‌కు చెందిన పాకిస్థాన్‌ క్వాడ్‌కాప్టర్‌ భారత భూభాగంలోకి ప్రవేశించడంతో కూల్చివేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలతో భారత్‌లోకి పాకిస్థాన్ ఉగ్రవాదులు చొరబడేందుకు చేసిన ప్రయత్నాలను సైన్యం దీటుగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. గత నెలలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణె జమ్మూ కశ్మీర్‌లో పర్యటించి సరిహద్దు వెంబడి బలగాల మోహరింపు, సన్నద్ధతపై కీలకంగా సమీక్షించారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు కళ్లుగప్పి ముష్కరులు భూగర్భంలో రహస్యంగా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థావరాన్ని భద్రతా దళాలు గురువారం (అక్టోబర్ 15) గుర్తించాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు 55 రాష్ట్రీయ రైఫిల్స్, 185 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్‌తో కలిసి అవంతిపొరా పోలీసులు గురువారం కవాని ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన రహస్య భూగర్భ స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. భూగర్భ స్థావరం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, 2091 రౌండ్ల ఏకే -47 మందుగుండు, ఒక పిస్టల్, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు.


By October 25, 2020 at 09:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-quadcopter-shot-down-by-indian-army-at-keran-sector-in-in-jammu-and-kashmir/articleshow/78853839.cms

No comments