నెల్లూరులో జంట హత్యల కలకలం.. అనుమానంతో భర్త ఘాతుకం!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/78599962/photo-78599962.jpg)
జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. భార్యపై అనుమానంతో భర్త ఘాతుకానికి తెగబడినట్టు తెలుస్తోంది. కట్టుకున్న భార్యని కిరాతకంగా నరికి చంపేశాడు. వివాహేతర సంబంధానికి సహకరిస్తోందన్న కోపంతో మరో మహిళను కూడా దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా అలజడి రేపింది. నెల్లూరు రూరల్ పరిధిలోని నాలుగో మైలులో ఈ ఘటన జరిగింది. నాలుగో మైలుకి చెందిన నాగేశ్వరరావు కొద్దికాలంగా భార్య నిర్మలమ్మపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో దారుణంగా హత్య చేశాడు. ఆమెకు సహకరిస్తోందని భావించి అదే ప్రాంతానికి చెందిన రమణమ్మ అనే మరో మహిళను కూడా నరికి చంపేశాడు. ఈ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
By October 11, 2020 at 10:54AM
No comments