Breaking News

పుట్టింటికి పంపలేదని గర్భిణి ఆత్మహత్య.. కృష్ణా జిల్లాలో విషాదం


కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త పుట్టింటికి పంపించలేదని గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్థాన్‌కి చెందిన ప్రజాపతి మహీంద్ర కుటుంబం కొన్నేళ్ల కిందట మండలం పల్లెర్లమూడికి వలసొచ్చింది. అక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మహీంద్ర భార్య ప్రజాపతి నిర్మ(24) ఇటీవల గర్భం దాల్చింది. ఆమె తన పుట్టింటికి వెళ్తానని కోరడంతో భర్త నిరాకరించాడు. ఇప్పుడు నాలుగో నెల నడుస్తోందని.. ఐదో నెల రాగానే పంపిస్తానని చెప్పడంతో భార్య నిరాశకు గురైంది. పుట్టింటికి వెళ్లేందుకు భర్త నిరాకరించాడని తీవ్ర మనస్థాపానికి గురైన భార్య నిర్మ అఘాయిత్యం చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరి బిగించుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By October 23, 2020 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/pregnant-woman-commits-suicide-in-krishna-district/articleshow/78823437.cms

No comments