Breaking News

మహిళ గొంతుకోసి దారుణ హత్య.. వికారాబాద్‌లో కలకలం


వికారాబాద్‌లో మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న నీటి గుంతలో గుర్తు తెలియని వివాహిత మృతదేహం లభ్యమైంది. దుండగులు ఆమె గొంతుకోసి కిరాతకంగా చంపేసి రహదారి పక్కన పడేసినట్లు తెలుస్తోంది. జిల్లా పూడూర్ మండలంలోని రాకంచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ సమీపంలో ప్రధాన రహదారి కల్వర్టు పక్కన గుంతలో వివాహిత మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతుకోసి హత్య చేశారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. Also Read:


By October 29, 2020 at 09:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-killed-brutally-in-vikarabad/articleshow/78924456.cms

No comments