Breaking News

ఆస్పత్రి బిల్లులపై పరిమితి విధించినా.. కరోనా నాశమవుతోన్న 80 శాతం కుటుంబాలు


కరోనా వైరస్‌ చికిత్సకు ప్రయివేట్ ఆస్పత్రుల బిల్లులతో ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కోవిడ్-19 చికిత్సకు అయ్యే వ్యయంపై నియంత్రణ విధించాయి. ఇన్నీ చేసినా ఒకరికి కరోనా సోకినా చికిత్సకు అయ్యే ఖర్చుతో దేశంలోని 80 శాతం కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే బిల్లులపై పరిమితులు విధించినా కనీసం పది రోజుల చికిత్సకయ్యే వ్యయం నెలవారీ ఖర్చుల కంటే అధిక రెట్లు ఎక్కువగా ఉంటుంది. జాతీయ గణాంక కార్యాలయం 2017-18 నివేదిక ప్రకారం.. దేశంలోని 80 శాతం కుటుంబాలు తలసరి వ్యయం నెలకు తక్కువలో తక్కువగా రూ.5వేలు లేదా రూ.25 వేల వరకు ఖర్చు చేస్తున్నాయి. ఇక, గుర్తింపులేని ఆస్పత్రుల్లోనూ కోవిడ్-19కు పది రోజుల చికిత్స కోసం రూ.80,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇది 80 శాతం జనాభా నెలవారీ తలసరి వ్యయానికి మూడు రెట్లు అధికం. ఒకవేళ, ఐసీయూలో చికిత్స అవసరమైతే బిల్లులు లక్షల్లోనే ఉంటున్నాయి. మొత్తం 20 రాష్ట్రాలలో ఐసోలేషన్ బెడ్స్, వెంటిలేటర్ లేని ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్ ఉన్నవారికి పది రోజుల చికిత్స ఖర్చును ప్రతి రాష్ట్రంలో నెలవారీ తలసరి వ్యయాన్ని తాజా నివేదికతో పోల్చి చూస్తే 80 శాతం మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తేలింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే చికిత్స చేస్తున్నారు. ఏదేమైనా కోవిడ్‌కు ముందు కూడా దేశంలోని ఇన్‌పేషెంట్‌లలో ప్రభుత్వ వాటా 42 శాతంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో పేలవమైన పరిస్థితుల నివేదికలు, అధికారులు, రాజకీయ నాయకులు కోవిడ్ చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడంపై విస్తృత ప్రచారంతో గందరగోళం నెలకుంది. గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం సూచించిన రోగులు లేదా ప్రభుత్వ ఆరోగ్య పథకాల పరిధిలోకి వచ్చేవారికి నిర్ణీత రేట్లు ఉన్నాయి. సాధారణంగా ఈ పరిధిలోకి వచ్చేవారి మాత్రమే ప్రభుత్వం ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు పంపుతున్నారు. కర్ణాటక, ఒడిశా, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే రోగులందరికీ ధరల పరిమితి వర్తిస్తుంది. ధర పరిమితులు ఉన్నప్పటికీ, పీపీఈ, సీటీ, ఎంఆర్ఐ వంటి పరీక్షలు, ఔషధాలు, స్పెషలిస్ట్ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక వ్యక్తికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే అంతకు ముందు చికిత్స కూడా అదే ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఢిల్లీ వంటి అనేక రాష్ట్రాల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నప్పటికీ, నియంత్రణ విధానం లేదు. ఆరోగ్యంపై విపత్తు ఖర్చును నిరోధించడం.. ఐరాస స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో ఒకటి. ఇది కుటుంబాలను పేదరికంలోకి నెడుతుంది. మొత్తం వార్షిక గృహ వ్యయంలో ఆరోగ్య వ్యయం వాటా 10- 25 శాతం కంటే ఎక్కువగా ఉంటే విపత్తుగా పరిగణించబడుతుంది. అన్ని రాష్ట్రాల్లో 10 రోజుల కోవిడ్ చికిత్స 80 శాతం కుటుంబాలకు 25% పరిమితికి మించి ఉంది. నెలవారీ ఖర్చులు అధికంగా ఉండే ఢిల్లీ, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కోవిడ్ చికిత్సకు వార్షిక గృహ వ్యయంలో 50% -80% ఉంటుందని అంచనా వేసింది. మిగతా రాష్ట్రాల్లో ఇది మొత్తంవార్షిక గృహ వ్యయానికి సమానం కావచ్చు లేదా రెట్టింపు కావచ్చు.


By October 12, 2020 at 10:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/hospital-cost-capped-but-covid-can-cripple-80-of-families-says-latest-study/articleshow/78613858.cms

No comments