‘కరోనా వల్లే దొంగగా మారా’.. పోలీసుల ఎదుట కన్నీరు పెట్టుకున్న నిరుద్యోగి

కరోనా వైరస్ ఎందరో జీవితాలను చిన్నాభిన్నం చేసింది. నచ్చిన పని చేస్తూ ఇష్టమైన ఆహారం తింటూ ఎంతో సంతోషంగా జీవించే వాళ్లందరు ఇప్పుడు ఉద్యోగాలు పోగొట్టుకుని, తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. ఇలాగే మంచి ఉద్యోగం చేస్తూ నిజాయతీగా జీవించే ఓ యువకుడు కరోనా కారణంగా దొంగగా మారిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. పూందపల్లిలోని నషరత్పేట మేప్పురు ప్రాంతానికి చెందిన శివరాజ్ అనే వ్యక్తి ఇంట్లో ఆగస్టు నెలలో చోరీ జరిగింది. ఇంట్లో బంగారం, నగదును ముట్టుకోని దొంగ టీవీ, ల్యాప్టాప్ మాత్రమే ఎత్తకెళ్లాడు. Also Read: ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం పూందపల్లి అంబేద్కర్ నగర్కు చెందిన పప్పు అలియాస్ అప్పన్రాజ్(25) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను దొంగను కాదని, తాను గతంలో పనిచేసిన చోట్ల విచారిస్తే తాను ఎంత మంచివాడినో తెలుస్తుందని అతడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు తమదైన శైలిలో విచారింగా అసలు నిజాన్ని అంగీకరించాడు. Also Read: గతంలో తాను ఓ కంపెనీలో పనిచేస్తూ గౌరవంగా జీవించేవాడినని, కరోనా పుణ్యమాని ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని పోలీసులకు చెప్పాడు. బ్రతకడం కోసం దిక్కుతోచని పరిస్థితుల్లోనే దొంగగా మారాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యాడు. తొలుత ఓ రోడ్డు పక్కన కొన్నాళ్లుగా పడివున్న బైక్ను ఎత్తుకెళ్లి అమ్మేశానని వెల్లడించారు. ఆ తర్వాత శివరాజ్ ఇంట్లోకి ప్రవేశించి టీవీ, ల్యాప్టాప్ దొంగిలించినట్లు తెలిపాడు. కష్టపడి పనిచేసుకునే తనను కరోనా వైరస్ దొంగగా మార్చిందని, తనను వదిలేస్తే మరోసారి దొంగతనం చేయనని పోలీసుల కాళ్లావేళ్లా పడ్డాడు. అయితే ఏ పరిస్థితుల్లోనే చేసినా నేరం నేరమే గనుక పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. Also Read:
By September 07, 2020 at 08:58AM
No comments