Breaking News

పెళ్లికాకుండా గర్భం.. పసికందును కాల్చేసిన అమ్మ, అమ్మమ్మ


పెళ్లి కాకుండానే తొందరపడింది. గర్భవతి అయ్యింది. అబార్షన్ చేయించుకునేందుకు సిద్ధమైంది. అయితే ఈలోపే పరిస్థితి చేయిదాటడంతో అది కుదరలేదు. దీంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. విషయం బయటకు వస్తే ఎక్కడ తమ పరువు పోతుందోనని బిడ్డను కన్న మహిళతో పాటు, ఆమె తల్లి ఘోరానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల పసికందును బతికుండానే సజీవదహనం చేశారు. ఈ ఘోరాతి ఘోరమైన ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. అయితే ఆ దారిన మోర్నింగ్ వాక్‌కు వెళ్లిన వారికి మృతదేహం కాలుతున్న వాసన రావడంతో ఈ విషయం కాస్త బయటపడింది. వివరాల్లోకి వెళ్తే... రైల్వే కాలనీ ఆరో వీధికి చెందిన శంకర గోమతి, ఆమె తల్లి ఇంద్రాణి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వివాహం కాకుండానే ఓ వ్యక్తి ద్వారా శంకర గోమతి గర్భవతి అయింది. ఆబార్షన్‌కు యత్నించినా, సమయం మించడంతో డాక్టర్లు కుదరదన్నారు. దీంతో గత్యంతరం లేక బిడ్డను కనాల్సి వచ్చింది. ఈ విషయం బయటకు రాకుండా తల్లి, కుమార్తె జాగ్రత్త పడ్డారు. అయితే బిడ్డ పుట్టిన నాలుగో రోజున ఈ అక్రమ సంతానం తమకు వద్దని అమ్మ, అమ్మమ్మ కలిసి బిడ్డను దహనం చేశారు. Read More: అయితే రైల్వే కాలనీ సమీపంలో వేకువ జామున మృతదేహం కాలుతున్న వాసన రావడాన్ని వాకింగ్‌ వెళ్లిన వారు గుర్తించారు. దగ్గరకు వెళ్లి చూడగా ఓ పసికందు అగ్నికి ఆహుతి అవుతుండడంతో మంటల్ని ఆర్పే యత్నం చేశారు. అయితే అప్పటికే ఆ శిశువు మరణించింది. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ మంగై కరసి బృందం అక్కడికి చేరుకుని విచారించగా మగబిడ్డగా తేలింది. ఈ కిరాతకానికి ఒడిగట్టిన పసికందు తల్లితో పాటు, అమ్మమ్మను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.


By September 10, 2020 at 08:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mother-and-grandmother-burned-baby-alive/articleshow/78030053.cms

No comments