Breaking News

కారు ఆగిపోయి కామాంధుల కంటపడిన మహిళ.. కన్నబిడ్డల ముందే తల్లిపై గ్యాంగ్ రేప్


పెట్రోల్ అయిపోవడంతో అర్ధరాత్రి వేళ కారు సడెన్‌గా ఆగిపోయింది. ఇద్దరు బిడ్డలతో బయల్దేరిన తల్లి నడిరోడ్డులో నిస్సహాయురాలిగా ఉండిపోయింది. కారు ఆగిపోయిన విషయం గమనించిన మానవ మృగాలు కారులో ఉన్న మహిళపై కన్నేశాయి. అద్దాలు పగలగొట్టి మరీ ఆమెను, పిల్లలను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి ఘాతుకానికి తెగబడ్డాయి. కన్నబిడ్డల ముందే తల్లిపై సామూహిక చేశాయి. ఈ అత్యంత అమానుష ఘటన పాకిస్తాన్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇస్లామాబాద్‌కి చెందిన మహిళ తన ఇద్దరు పిల్లలతో కారు గుజ్రన్‌వాలాకి బయల్దేరింది. సడెన్‌గా పెట్రోల్ అయిపోవడంతో గుజ్జర్‌పుర మోటర్‌వేపై కారు ఆగిపోయింది. సమయం అర్ధరాత్రి ఒకటిన్నర కావడంతో ఆమె తన బంధువుకి ఫోన్ చేసి రావాలని కోరింది. తన లొకేషన్ అతనికి పంపించింది. వెంటనే పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోన్ చేయాలని బంధువు సూచించాడు. వారికి ఆమె ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో నిస్సహాయురాలిగా ఉండిపోయింది. అర్ధరాత్రి వేళ చిమ్మచీకట్లో కారులో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మహిళ కామాంధుల కంటపడింది. ఇద్దరు దుర్మార్గులు కారు వద్దకు వచ్చి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. కారు అద్దాలు పగలగొట్టి బయటకు లాగి పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లారు. ఆమె పిల్లల ముందే తల్లిపై సామూహిక అత్యాచారం చేశారు. ఇద్దరూ ఆమెపై పడి అత్యంత దారుణంగా కామకోరికలు తీర్చుకున్నారు. అంతటితో ఆగని దుర్మార్గులు ఆమె పర్సులో ఉన్న లక్ష నగదు, బంగారం, ఏటీఎం కార్డులు కూడా దోచుకెళ్లారు. Also Read: ఈ ఘటన పాకిస్తాన్‌లో సంచలనంగా మారింది. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితులపై కేసు నమోదైంది. మోటర్ వే రేప్ కేసును సీరియస్‌గా తీసుకున్నామని.. 20 ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఐజీ ఇనాం ఘని తెలిపారు. ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు చెప్పారు. ఇప్పటికి 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. Read Also:


By September 11, 2020 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-gangraped-in-front-of-her-kids-in-pakistan/articleshow/78051109.cms

No comments