Breaking News

కరోనా మెడిసిన్ పేరుతో తండ్రికి పురుగులమందు.. కొడుకు మృతి.. హైదరాబాద్‌లో దారుణం


కరోనా వైరస్ నివారణ పేరుతో పేరెంట్స్‌కి పురుగుల మందు కలిపి ఇచ్చిన కొడుకు.. తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పంజాగుట్టకి చెందిన అనీష్ రెడ్డి కరోనా నివారణకు మందు తెచ్చానంటూ మూడు గ్లాసుల్లో పురుగుల మందు కలిపాడు. తల్లిదండ్రులతో పాటు తాను కూడా తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. పురుగుల మందు కలిపిన గ్లాసును తండ్రి రాంరెడ్డితో తాగించాడు. అనంతరం తాను కూడా తాగాడు. తల్లి వంట గదిలోకి వెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది. ఆమె వంట గది నుంచి వచ్చి చూసేసరికి తండ్రీకొడుకులు వాంతులు చేసుకుంటూ కనిపించడంతో ఆందోళన చెంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎక్కువ మొత్తంలో పురుగుల మందు తాగడంతో అనీష్ రెడ్డి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన తండ్రి రాంరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: ఆర్థిక సమస్యల కారణంగానే కొడుకు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అతని తల్లి వాపోయింది. ఐటీ కంపెనీలకు క్యాటరింగ్ చేస్తున్న అనీష్ రెడ్డికి లాక్‌డౌన్ కారణంగా చెల్లింపులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. పలు కంపెనీల నుంచి రావాల్సిన బకాయిలు కూడా రాకపోవడంతో ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Read Also:


By September 11, 2020 at 07:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-commits-suicide-by-taking-pesticides-in-hyderabads-panjagutta/articleshow/78050726.cms

No comments