Breaking News

ఫేస్‌బుక్ సాయంతో ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుకోసం ఓ పార్టీ ప్రయత్నం.. ఆ సంస్థ మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు


ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మరోసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని అమ్ ఆద్మీ పార్టీ విజయఢంకా మోగిచింది. , మధ్య హోరాహోరీ పోరు నెలకుంటుందని భావించినా ఫలితాలు మాత్రం ఏకపక్షంగా వచ్చాయి. దీంతో వరుసగా మూడోసారి ఆప్ అధికారాన్ని చేజిక్కించుకుంది. తాజాగా, ఫేస్‌బుక్‌ బహిష్కరించిన ఓ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ ఎన్నికలను ఓ రాజకీయ నెట్‌వర్క్‌ ప్రభావితం చేసిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ ఆప్‌ 62, బీజేపీకి 8 దక్కాయి. ఈ ఫలితాలు బీజేపీని తీవ్ర నిరాశకు గురిచేశాయి. దీనిపై బీజేపీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా మిన్నుండుకుపోయింది. ఎన్నికలు ముగిసి 8 నెలలు పూర్తయిన తర్వాత ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగి ఒకరు మాత్రం ఈ ఎన్నికలపై సంచలన విషయాలు బయటపెట్టారు. ఫేస్‌ బుక్‌లో డేటా సైంటిస్ట్‌గా పనిచేసిన సోఫీ జాంగ్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి చివరి రోజు 6,600 పదాలతో కూడిన ఓ అంతర్గత మెమోను సంస్ధకు మెయిల్‌ చేశారు. ఇందులో ఢిల్లీ ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు సదరు పొలిటికల్‌ నెట్‌వర్క్‌ ఎలా పనిచేసిందో, ఫలితాలపై వీటి ప్రభావం ఎలా పడిందో బయటపెట్టారు. నకిలీ ఖాతాలను నియంత్రించడంలో ఫేస్‌బుక్‌ విఫలం కావడం దీనికి కారణమైందని కూడా ఆమె ఆరోపించారు. దీంతో ఢిల్లీ ఎన్నికలు జరిగిన తీరుపై సర్వత్రా చర్చ సాగుతోంది. సంస్ధకు అంతర్గతంగా పంపిన మెమోలో విదేశీ ప్రభుత్వాలు తమ సొంత పౌరులను ప్రభావితం చేసేందుకు ఫేస్‌బుక్‌ను ఎలా వాడుకుంటున్నారో తూర్పారబట్టారు. అలాగే ఎన్నికల్లో ప్రభుత్వాధినేతల జోక్యం లేకుండా చూసేందుకు తాను వ్యక్తిగతంగా లెక్కలేనన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని సోఫీ జాంగ్‌ తెలిపారు. ఇదే క్రమంలో ఢిల్లీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన వంద మంది కీలక వ్యక్తుల నెట్‌వర్క్‌ను తాను బ్రేక్‌ చేసినట్లు సోఫీ పేర్కొన్నారు. భారత్, ఉక్రెయిన్, స్పెయిన్, బ్రెజిల్, బొలీవియా, ఈక్వెడార్ వంటి దేశాలలో రాజకీయ అభ్యర్థులు లేదా ఫలితాలను ప్రభావితం చేసే సమన్వయ ప్రచారానికి ఆధారాలు జాంగ్ గుర్తించారు. అసమానత లేని ఒప్పందంపై సంతకం చేయకుండా ఉండటానికి 64,000 డాలర్లు తిరస్కరించినట్లు ఆమె పేర్కొంది. అయితే, సోఫీ ఆరోపణలపై స్పందించిన ఫేస్ బుక్‌ కూడా ఎన్నికల్లో ఫేస్‌బుక్‌ను వాడుకునేందుకు ప్రయత్నించిన పలు నకిలీ ఖాతాలను నియంత్రించినట్లు చెప్పుకొచ్చింది. దీనిపై బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవ్యా స్పందిస్తూ..ఢిల్లీ స్థానిక ఎన్నికలను ప్రభావితం చేయడానికి ‘నెట్‌వర్క్’ ప్రయత్నించారని రాశారు..‘ఆప్ గెలిచింది’..ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఈ సమన్వయ ప్రచారంలో పార్టీ పాల్గొంది’ అని ట్వీట్ చేశారు. దీనికి ఆప్ కౌంటర్ ఇచ్చింది. ‘ప్లాట్‌ఫాం () బీజేపీకి అనుకూలంగా ఉందని అందరికీ తెలుసు.. ‘సమన్వయ ప్రచారం’ ద్వారా ఆయన అంటే మేము వ్యవస్థీకృతమై ఉన్నాం. అసంఘటితంగా ఉండటం ద్వారా బీజేపీతో పోరాడలేం. ‘సమన్వయ ప్రచారం’ అని మాల్వావా అంటే మేము ఫేస్‌బుక్‌ ప్రభావితం చేశామని.. కానీ అది అబద్ధం’అని ఆప్ ఐటీ చీఫ్ అంకిత్ లాల్ అన్నారు.


By September 16, 2020 at 12:09PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/attempt-was-made-to-influence-delhi-assembly-polls-says-ex-staffer-of-facebook/articleshow/78142172.cms

No comments