వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. గుంటూరులో దారుణం
జిల్లా వినుకొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తని ప్రత్యర్థులు కిరాతకంగా కొట్టిచంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పాత గొడవల నేపథ్యంలో దుండగులు దారుణంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పట్టణంలోని క్రిస్టియన్ పాలెం పరిధిలోని హనుమాన్ నగర్కి చెందిన గిరిజన యువకుడు బళ్లాని అబ్రహాం(39) అలియాస్ బుజ్జికి తన దాయాదులతో గొడవలున్నాయి. తన సోదరులతో రెండు రోజుల కిందట మద్యం మత్తులో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అది మనసులో పెట్టుకుని మరుసటి రోజు మరోవర్గం మూకుమ్మడిగా దాడి చేసింది. విచక్షణా రహితంగా కొట్టడంతో అబ్రహాం తీవ్రగాయాల పాలయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అబ్రహాంని కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. Also Read: పట్టణంలోని వెన్నపూస కాలనీకి చెందిన వ్యక్తులే అతన్ని దారుణంగా కొట్టి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మృతుడు అబ్రహాం పట్టణంలోని అన్ని వర్గాలకు తెలిసిన వ్యక్తి కావడం.. అధికార వైసీపీ కార్యకర్త కావడంతో పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also:
By September 12, 2020 at 11:27AM
No comments