Breaking News

గ్రౌండ్ ఫ్లోర్‌లో భర్త.. ఫస్ట్ ఫ్లోర్‌లో భార్య.. చివరికి..


ఆలుమగలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ కాపురం అన్యోన్యంగా సాగిపోతుంది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు వస్తే మాత్రం పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. తాజాగా అలాంటి దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. కుటుంబ కలహాల కారణంగా విడివిడిగా ఒకే ఇంట్లో ఉంటున్న భర్తకి లేటు వయసులో ఘాటు కోరిక పుట్టింది. అందుకు అతని కొడుకు అడ్డుపడడంతో పిచ్చెక్కిపోయి దారుణంగా ఎక్కడపడితే అక్కడ కొరికేశాడు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌కి చెందిన నజీముద్దీన్ షేక్‌(50)కి భార్య జుబేదాబానో, కొడుకు యహ్యా షేక్ ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ఒకే ఇంట్లో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. భర్త గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుండగా.. కొడుకుతో కలసి భార్య ఇంటి ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉంటోంది. అయితే ఇటీవల భర్తకి ఈ వయసులో ఘాటు కోరిక కలిగింది. చేసుకుని మరో మహిళని ఇంటికి తెద్దామని భావించాడు. అయితే ఆ విషయం పైన ఇంట్లో ఉంటున్న భార్య, కొడుకుకి తెలిసిపోయింది. Also Read: మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న యహ్యా తండ్రి రెండో పెళ్లి ఆలోచనకు అడ్డుపడ్డాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన నజీముద్దీన్ కన్నకొడుకుపై పంటి దాడికి దిగాడు. పిచ్చెక్కిపోయినట్టు పళ్లతో బలంగా కొరికేశాడు. భుజం, బుగ్గలు, వీపు భాగంలో విచక్షణా రహితంగా కొరికేశాడు. తండ్రి పంటి దాడిలో గాయాలపాలైన కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Read Also:


By September 22, 2020 at 01:13PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/father-brutally-bites-son-after-he-objects-second-marriage-in-ahmedabad/articleshow/78251325.cms

No comments