లేడీ టీచర్ని స్కూల్లోనే కత్తితో పొడిచి.. కాకినాడలో దారుణం

కాకినాడలో దారుణ ఘటన జరిగింది. పాఠశాల విధులకు హాజరైన ఉపాధ్యాయురాలిని స్కూల్లో ఆమె భర్త కిరాతకంగా కత్తితో పొడిచేశాడు. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లతో సమావేశం జరుగుతుండగా ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన వి.కొత్తూరు కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయలో చోటుచేసుకుంది. పాఠశాలలో జువాలజీ టీచర్గా పనిచేస్తున్న మధులాక్షి రోజు మాదిరిగానే విధులకు హాజరయ్యారు. స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం జరుగుతుండగా ఆమె భర్త ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన సహచర ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో టీచర్ మధులాక్షి తీవ్రంగా గాయపడ్డారు. తక్షణం ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది. Read Also: Also Read:
By September 17, 2020 at 09:41AM
No comments