హైదరాబాద్: అమ్మమ్మ ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కిన బాలికపై గ్యాంగ్ రేప్

ఒంటరిగా ఆటో ఎక్కిన బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు ఆటోడ్రైవర్లను హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్కు చెందిన ఓ బాలిక(17) జులై 25వ తేదీ సాయంత్రం కొత్తపేటలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఎల్బీనగర్ చౌరస్తాలో ఆటో ఎక్కింది. బాలిక అమాయకత్వాన్ని గ్రహించిన ఆటోడ్రైవర్ ఆంబోతు రమేష్(21) ఆమెను మాటల్లో పెట్టి హయత్నగర్ వైపు ఆటో మళ్లించాడు. Also Read: బాలికను అమ్మానగర్లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే మరో ఇద్దరు యువకులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. ముగ్గురూ కలిసి బాలికను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరోవైపు చీకటి పడినా బాలిక ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాత్రంతా బాలికకు నరకం చూపించిన నిందితులు మరుసటి రోజు ఉదయం ఆమెను ఎల్బీనగర్లోని ఓ ఆస్పత్రి సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. Also Read: అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఆటో నంబర్ను గుర్తించారు. దాని ఆధారంగా నిందితులైన శివమ్మనగర్కు చెందిన ఆంబోతు రమేష్ (21).. భరత్నగర్కు చెందిన గాల పవన్ (22), రమావత్ సంతోష్ (19)లను అదుపులోకి తీసుకున్నారు. Also Read:
By September 02, 2020 at 07:11AM
No comments