Breaking News

హైదరాబాద్‌లో భారీ చోరీ... రూ.కోటి సొత్తుతో పరారైన వాచ్‌మెన్


హైదరాబాద్‌ నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. సైనిక్ పురిలో నివాసముండే దంపతుల కుమారుడికి ఇటీవలే పెళ్లి చేశారు. ఈ క్రమంలోనే ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తిరిగొచ్చి చూసేసరికి ఇంట్లోని ఆభరణాలు, విలువైన వస్తువులు కనిపించలేదు. ఇంటికి కాపలాగా ఉండే వాచ్‌మెన్ కనిపించకపోవడంతో అతడే దొంగతనం చేసినట్లు అనుమానిస్తున్నారు. Also Read: ఈ ఘటనపై బాధితులు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము రిసెప్షన్‌ నుంచి తిరిగొచ్చే సరికి కిలో బంగారంతో పాటు విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి మొత్తం విలువ కోటి రూపాయలు వరకు ఉంటుందని చెప్పారు. నేపాల్‌కు చెందిన భీమ్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం వాచ్‌మెన్‌గా చేరాడని, చోరీ తర్వాత అతడు కనిపించకపోవడంతో అతడిపైనే అనుమానాలున్నాయని పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By August 03, 2020 at 12:05PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/watch-man-theft-worth-of-1-crore-money-in-owner-house-in-hyderabad/articleshow/77326795.cms

No comments