Breaking News

ఒకటి రెండేళ్లు కాదు.. దశాబ్దం పాటు కరోనా ప్రభావం: బాంబు పేల్చిన డబ్ల్యూహెచ్ఓ


కోవిడ్ మహమ్మారి గురించి మరోసారి ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు చేసింది. వ్యాప్తి మొదలైన ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ఎమర్జెన్సీ టీమ్ శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉండనుందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. Read Also: మొత్తం 30 మంది (18 మంది సభ్యులు, 12 మంది సలహాదారులు) ఉన్న ఈ బృందం కరోనాపై సమీక్ష జరపడం ఇది నాలుగోసారి. మాస్క్‌‌లు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించే విషయంపై కమిటీ సంస్థకు కొన్ని సిఫార్సులు చేసింది. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా సూచనలు చేసింది. చైనా వెలుపల పాజిటివ్ కేసులు 100 దాటి, కోవిడ్ మరణాలే లేని సమయంలో ప్రపంచ ఆరోగ్య అత్యయిక పరిస్థితి (పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్‌సర్న్‌-పీహెచ్‌ఈఐసీ) ప్రకటించాల్సి వచ్చిందని అధ్నామ్ గుర్తుచేశారు. ఇలాంటి మహమ్మారులు శతాబ్దానికి ఒకసారి పుట్టుకొస్తాయని, వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. అయితే, అత్యయిక స్థితిని ఇదే స్థాయిలో ఇంకా కొనసాగిస్తారా అన్న అంశంపై మాత్రం పూర్తి స్పష్టత రాలేదని పేర్కొన్నారు. Read Also: కరోనా విషయంలో శాస్త్ర సాంకేతి సంబంధమైన అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని.. ఇంకా చాలా వాటికి సమాధానం దొరకాల్సి ఉందన్నారు. ఇంకా చాలా మందికి వైరస్‌ ముప్పు పొంచి ఉందని.. ఇప్పటికే సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోనూ మరోసారి విజృంభించే ప్రమాదం ఉందని అధ్యయనాల్లో తేలిందన్నారు. సెరోలజీ (యాంటీబాడీ) అధ్యయన ప్రారంభ ఫలితాలు స్థిరమైన అంశాలను చిత్రించాయి.. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు తీవ్రమైన వ్యాప్తి ఎదుర్కొన్న ప్రాంతాలలో కూడా వైరస్ బారిన పడతారని తెలిపింది అని అన్నారు. మహమ్మారి తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న దేశాల్లో మరోసారి వైరస్ విజృంభిస్తోందని అధ్నామ్ గుర్తుచేశారు. తొలినాళ్లలో పెద్దగా వైరస్ ప్రభావానికి గురికాని దేశాలు సైతం ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కొన్ని దేశాలు మాత్రం వైరస్‌ను బాగా కట్టడి చేయగలిగాయన్నారు. Read Also: ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. చైనాతో కమ్ముక్కయి ఉద్దేశపూర్వకంగానే కోవిడ్‌పై ఆ సంస్థ తాత్సారం చేసిందని అమెరికా సహా మరికొన్ని దేశాలు ఆరోపించాయి. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓతో తీవ్రంగా విభేదించిన అమెరికా ఏకంగా దానిని నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. Read Also: గతేడాది డిసెంబరు చివరిన చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి వెలుగుచూసిన కరోనా వైరస్.. ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఇప్పటి వరకూ 1.77 కోట్ల మంది వైరస్ బారినపడగా.. 6.83 లక్షల మంది బలయ్యారు. అత్యధికంగా అమెరికాలో 47 లక్షల మందికి వైరస్ నిర్దారణ కాగా.. 1.56 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం 150కిపైగా సంస్థలు తీవ్రంగా కృషిచేస్తున్నాయని, 2021 తొలినాళ్లలో కూడా అందుబాటులోకి రాకపోవచ్చని గతవారం డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.


By August 01, 2020 at 11:53AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/impact-of-coronavirus-will-be-felt-for-decades-to-come-says-who-chief/articleshow/77298243.cms

No comments