ఎటుచూసినా భయానక దృశ్యాలు.. నా చేతులు, చొక్క రక్తంతో తడిసిపోయాయి: విమాన ప్రమాదంపై స్థానికులు

ఓవైపు బాధితుల ఆర్తనాదాలు.. అంబులెన్సుల సైరన్లు, మరోవైపు రక్తంతో తడిసిన బట్టలు.. భయంతో వణికిన చిన్నారులు.. ఇవీ శుక్రవారం రాత్రి కొజికోడ్ విమాన ప్రమాదం సమయంలో చోటుచుసుకున్న భయానక దృశ్యాలు. దుబాయి నుంచి కొజికోడ్కు చేరుకున్న రన్వేపై జారిపడి లోయలోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ఇప్పటివరకు 19మంది ప్రాణాలు కోల్పోగా... 123 మంది గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి అక్కడ నెలకొన్న భయాక పరిస్థితి గురించి స్థానికులు వివరించారు. Read Also: ప్రమాదం జరిగిన సమయంలో భారీ వర్షం కురుస్తున్నా అధికారు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. విమాన శకలాల నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. కానీ, ఆ క్షణంలో ఏం జరిగిందో తెలియని ఆందోళనతో ప్రయాణికులు నిశ్చేష్టులైపోయారు. బీతావాహ క్షణంలో వారి అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. దీంతోపాటు నాలుగు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు, ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. Read Also: భయంతో చిన్నారులు సహాయ సిబ్బంది ఒంటికి అతుక్కుపోయారు. ప్రమాదంపై వెంటనే స్పందించిన స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించిన దృశ్యాలు, వారికి చికిత్స కోసం వైద్యులు పరుగులుపెట్టిన దృశ్యాలు కనిపించాయి. విమాన ప్రమాదం జరిగిన తర్వాత భారీ శబ్దం రావడంతో అక్కడకు చేరుకున్నామని స్థానికుడు తెలిపారు. విమానం సీట్ల కిందట చిన్న పిల్లలు చిక్కుకుని ఉన్న దృశ్యాలు కంటతడిపెట్టించాయని అన్నారు. Read Also: ‘మేము అక్కడికి చేరుకున్నప్పుడు కొందరు లోయలో పడిపోయారు. వారిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లు విరిగిపోయాయి... నా చేతులు, చొక్కా రక్తంతో తడిపోయాయి’ అని తెలిపాడు. మరో వ్యక్తి మాట్లాడుతూ.. తీవ్రంగా గాయపడి కాక్పీట్లో చిక్కుకున్న పైలట్ను అతికష్టంమీద బయటకు తీశామని పేర్కొన్నాడు. అంబులెన్స్లు చేరుకోవడానికి ముందే క్షతగాత్రులను స్థానికులు బయటకు తీసి, కార్లలో వివిధ హాస్పిటల్స్కు తరలించారు.
By August 08, 2020 at 11:53AM
No comments