Breaking News

రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం.. విశిష్ట అతిథులుగా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు


ఏటా స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాని, కేంద్ర మంత్రులు, ప్రతపక్ష నేతలు తదితరులను ఆహ్వానిస్తారు. అయితే, ఈసారి మాత్రం కరోనా యోధులకు అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 15న సాయంత్రం జరిగే ఎట్‌ హోం కార్యక్రమానికి వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు అతిథులుగా హాజరుకానున్నారు. కొవిడ్‌-19పై పోరాటంలో ముందున్న వీరులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సత్కరిస్తారు. అలాగే కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయి వారి అంతిమ సంస్కారాలు నిర్వహించే సిబ్బంది, పోలీసులు, సెక్యూరిటీ గార్డులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. భౌతిక దూరం నిబంధనల దృష్ట్యా ఈసారి ఎట్‌ హోం కార్యక్రమానికి అతిథుల జాబితాను 1500 నుంచి 90 మందికే పరిమితం చేశారు. కరోనా యోధులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, మీడియా ప్రముఖులు ఎట్‌ హోంలో పాల్గొంటారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. కరోనా యోధులకు దేశం రుణపడి ఉంటుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు కరోనా రోగులకు అలుపెరుగని సేవలందిస్తున్నారని కొనియడారు. వీరంతా తమ పరిమితి కంటే ఎక్కువగా పని చేస్తూ ఎంతో మంది ప్రాణాల్ని కాపాడుతున్నారని పేర్కొన్నారు. అత్యవసర సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.


By August 15, 2020 at 08:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/president-ramnath-kovind-will-host-some-really-special-guests-at-home-today/articleshow/77557305.cms

No comments