Breaking News

పెళ్ళిపీటలెక్కబోతున్న మెగాహీరో.. హింట్ ఇచ్చేసాడు.


లాక్ డౌన్ టైమ్ లో టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలెక్కుతున్నారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ అందరూ ఓ ఇంటి వారవుతున్నారు. నితిన్, నిఖిల్, రానా.. ఇలా ఒక్కొక్కరుగా పెళ్ళి బాట పడుతున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో పెళ్ళి పీటలెక్కబోతున్నాడు. మెగాహీరో సాయి ధరమ్ తేజ్ పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయమై సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా హింట్ ఇచ్చాడు.

సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, మనం ఒక్కోసారి ఎన్నో అనుకుంటాం..కానీ ఆ టైమ్ వచ్చినపుడు మరి అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన వాట్సాప్ వీడియోని పోస్ట్ చేసాడు. సింగిల్ ఆర్మీ పేరుతో క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ లో నిఖిల్, రానా ఒక్కొక్కరుగా బయటకి వెళ్ళిపోతున్నారు. చివరికి సాయి ధరమ్ తేజ్ రిప్లై ఇస్తూ సారీ ప్రభాస్ అన్నా అని మెసేజ్ ఉంది.

మిగతా విషయాలని రేఫు ఉదయం 10గంటలకి వెల్లడి చేస్తాడట. మొత్తానికి లాక్ డౌన్ టైమ్ లో సాయి ధరమ్ తేజ్ తన జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానిస్తున్నాడన్నమాట.

Click here for Tweet



By August 24, 2020 at 02:24AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/52314/sai-dharam-tej.html

No comments