Breaking News

ఫోన్ మాట్లాడలేదని... భర్తను గదిలో పెట్టి తాళం వేసిన నవవధువు ఏం చేసిందంటే


చిన్నచిన్న కారణాలకే కొందరు తమ ప్రాణాలు బలితీసుకుంటున్నారు. భర్త చీర కొనివ్వలేదని, భర్త బిర్యానీ తీసుకురాలేదని ఇలా చాలామంది భార్యలు ఇలా చిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. తాజాగా ఓ నవవధువు భర్తపై అలిగి బలవన్మరణానికి పాల్పడింది. భర్త సెల్‌ఫోన్‌లో మాట్లాడలేదని అలిగిన నవ వధువు ఉరివేసుకుంటానని బెదిరించి ప్రాణం తీసుకున్న ఘటన తమిళనాడు తిరువళ్లూరు సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిరువళ్లూర్‌ సమీపంలోని చెవ్వైపేట కందన్‌ కొట్టై గ్రామానికి చెందిన హరిబాబుకు, షర్మిల (29)కు మూడు నెలల క్రితం పెళ్లి జరిగింది. కుటుంబ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక జరిపించారు. అయితే హరిబాబు పని కోసం కాంచీపురం వెళ్లాడు. సాయంత్రం షర్మిల భర్త సెల్‌ ఫోన్‌కు కాల్‌ చేసింది. అతను మాట్లాడలేదు. దీంతో భర్తపై అలిగిన షర్మిల సాయంత్రం రాగానే భర్తను నిలదీయాలనే డిసైడ్ అయ్యింది. ఇలోపు సాయంత్రం అయ్యింది. హరిబాబు ఇంటికి తిరిగి వచ్చాడు. రాగానే భర్తను దీని గురించి అడిగి షర్మిల అలిగింది. నా ఫోన్ ఎందుకు మాట్లాడలేదంటూ భర్తతో వాదనకు దిగింది. అంతేకాదు.. భర్తను బెదిరించేందుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని ఒక గదిలో పెట్టి తాళం వేసింది. తర్వాత ఆమె పడక గదికి వెళ్లి ఉరివేసుకుంది. గొంతుకు తాడు బిగుసుకోవడంతో మృతి చెందింది. హరిబాబు కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకుని చూడగా షర్మిల ఉరికి శవంగా వేలాడుతూ కనిపించింది. చెవ్వై పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


By August 11, 2020 at 08:34AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bride-commits-suicide-after-husband-reject-call-at-tamilnadu/articleshow/77475515.cms

No comments