Breaking News

కోజికోడ్ విమాన ప్రమాదం.. బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు


కోజికోడ్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానం నుంచి బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. బ్లాక్‌బాక్స్‌లోని డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా‌ రికార్డర్‌ (డీఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌)లలో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషించనున్నారు. దీని ద్వారా.. విమానం ఎత్తు, స్థితి, వేగానికి సంబంధించిన వివరాలతోపాటు ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ వివరాలు కూడా లభించనున్నాయి. దీంతో ప్రమాదానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి హరదీప్ పురీ కోజికోడ్ చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం పౌర విమానయాన శాఖ అధికారులు, నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పైలట్ దీపక్ వసంత్ సాథే తల్లి మాట్లాడుతూ.. తను ఓ గొప్ప కొడుకని, ఇతరులకు సాయం చేయడంలో ముందుండేవాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికీ ఉపాధ్యాయులు అతడిని మెచ్చుకుంటారని దీపక్ తల్లి నీలమ సాథే ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయి నుంచి కోజికోడ్‌కు వస్తున్న రన్‌వేపై అదుపుతప్పి జారిపడటంతో రెండు ముక్కలైంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 19 మంది ప్రాణాలు కోల్పోగా.. 123 మంది గాయపడ్డారు. వీరిలో ఓ గర్భిణి, నలుగురు చిన్నారులు సహా 23 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. చుట్టుపక్కల 13 ఆస్పత్రుల్లో 171 మంది చికిత్స పొందుతున్నారు.


By August 08, 2020 at 01:02PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/air-india-plane-crash-black-box-recovered-from-the-wreckage/articleshow/77428957.cms

No comments