Breaking News

చైనాకు కేంద్ర మరో షాక్.. వందే భారత్ రైళ్ల టెండర్ రద్దు


సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న చైనాకు సరైన గుణపాఠం చెప్పాలని భారత్ నిర్ణయించింది. ఇందులో భాగంగా చైనా యాప్‌లపై నిషేధం విధించి, పలు ప్రాజెక్టుల నుంచి ఆ దేశ సంస్థలను తప్పించింది. తాజాగా, సెమీ-హైస్పీడ్ రైలు ప్రాజెక్టు టెండర్లను రైల్వే శాఖ శుక్రవారం రద్దుచేసింది. మొత్తం 44 సెట్ల సెమీ-హైస్పీడ్ రైళ్ల తయారీకి రైల్వే శాఖ టెండర్లను పిలవగా.. వీటిని చైనా సంస్థ దక్కించుకుంది. అనూహ్యంగా వీటిని రద్దు చేసిన రైల్వే శాఖ.. మార్గదర్శకాలను సమీక్షించి వారం రోజుల్లో కొత్తగా టెండర్లకు బిడ్‌ను ఆహ్వానించునున్నట్టు ప్రకటించింది. కొత్త టెండర్లలో స్థానిక కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. క్లాస్ -1,2,నాన్-లోకల్ కేటగీరిని ప్రవేశపెట్టి, దీని ఆధారంగా స్థానికులకు ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాధాన్యత ఇస్తారు. క్లాస్ -1లో స్థానిక సరఫరాదారులు అన్ని ప్రభుత్వ కొనుగోళ్లలో ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే వారి దేశీయ విలువ అదనంగా 50% లేదా అంతకంటే ఎక్కువ. తర్వాతి స్థానంలో క్లాస్ -2 సరఫరాదారులు ఉంటారు. దీని విలువ 20-50 శాతం మధ్య ఉంటుంది. మరోవైపు, రైల్వే ద్వారా వస్తువులను రవాణా చేయడానికి వ్యాపారులు, సరఫరాదారులు 139కి డయల్ చేయవచ్చని రైల్వే మంత్రి శుక్రవారం ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ హెల్ప్‌లైన్ నంబర్ రైలు ప్రయాణ వివరాలు పొందడానికి ఉపయోగించేవారు. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రైళ్ల తయారీకి ముందుకొచ్చిన కేంద్రం.. మొత్తం 44 జతల రైళ్లను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా, కేంద్రంతో సంయుక్త వెంచర్‌ను కుదుర్చుకోవడానికి బిడ్లు వేసిన ఏకైక విదేశీ సంస్థగా చైనాకు చెందిన సీఆర్‌ఆర్‌సీ కార్పొరేషన్‌ నిలిచింది. హర్యానా కేంద్రంగా ఓ సంస్థతో కలిసి సీఆర్‌ఆర్‌సీ పయోనిర్‌ ఎలక్ట్రిక్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట సంయుక్త వెంచర్‌గా ఉండడానికి టెండర్‌ కోసం ప్రయత్నించింది. తాజాగా, దీనిని కేంద్రం రద్దుచేసింది.


By August 22, 2020 at 07:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/border-standoff-china-link-tender-for-44-vande-bharat-trains-cancelled/articleshow/77686242.cms

No comments