Breaking News

నడిరోడ్డుపై మనిషిని కిలోమీటరు ఈడ్చుకెళ్లిన డీసీఎం.. హైదరాబాద్‌లో దారుణం


సరకు రవాణా చేసే ఓ డ్రైవర్‌, క్లీనర్ చూపిన నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. డీసీఎం వెనుక తలుపు కొక్కెం ఊడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉప్పల్‌లో ఆ డీసీఎం వెనకే బైక్‌పై వస్తున్న వ్యక్తి బట్టలకు ఊడిపోయిన తలుపు కొక్కెం తగలడంతో కిలో మీటరు వరకు అతణ్ని ఈడ్చుకెళ్లి పోయారు. ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన వెంకటేష్‌ (35) అనే వ్యక్తిని డీసీఎం లాక్కెళ్లిపోయింది. ఇతను ప్రైవేటు బస్సులకు డ్రైవర్‌‌గా పని చేస్తున్నారు. గురువారం రాత్రి రామంతాపూర్‌లో బస్సును నిలిపి డ్యూటీ ముగించుకొని బైకుపై ఇంటికి వెళ్తున్నాడు. ఉప్పల్‌-నాగోల్‌ మార్గంలో వెనుక నుంచి వచ్చి ఓవర్ టేక్ చేసిన డీసీఎం తలుపునకు వేలాడుతున్న కొక్కెం వెంకటేష్‌ వేసుకున్న రెయిన్‌ కోటుకు తగిలింది. దీంతో బైక్ పట్టు తప్పి కింద పడిపోయింది. వెంకటేష్‌ను డీసీఎం ఈడ్చుకెళ్లి పోయింది. Also Read: కానీ, ఈ విషయం డ్రైవర్‌కు కనిపించలేదు. బాధితుడు కేకలు పెట్టినా వినిపించలేదు. వాహనదారులూ పరిశీలించలేదు. నాగోల్‌ చౌరస్తా వరకు అలాగే డీసీఎం వెంకటేష్‌ను ఈడ్చుకెళ్లింది. నాగోల్‌ చౌరస్తాలో రెయిన్‌ కోటు తెగిపోవడంతో అప్పుడు వెంకటేష్‌ రోడ్డుపై పడిపోయాడు. అప్పటికే తలకు, పక్కటెముకలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలైన అతన్ని స్థానికులు 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. Also Read:


By August 16, 2020 at 11:04AM


Read More https://telugu.samayam.com/telangana/news/dcm-van-dragged-away-man-for-a-kilometer-in-hyderabads-uppal/articleshow/77570629.cms

No comments