Breaking News

రూ.50కోట్ల భూమి కబ్జాకు యత్నం.. బాధితుడే అసలు నిందితుడని తెలిసి షాక్


హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రూ.50 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించి ఏసీబీనే మస్కా కొట్టించేందుకు యత్నించిన కేటుగాడి గుట్టు రట్టయింది. షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయం ఆర్‌ఐ నాగార్జునరెడ్డి ఏసీబీకి చిక్కడానికి, బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ ఎస్సై రవీందర్‌పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు కావడానికి కారణమైన సయ్యద్‌ అబ్దుల్ అనే వ్యక్తే అసలు నేరస్థుడని తేలడంతో పోలీసులు అతడిని కటకటాల్లోకి నెట్టారు. బంజారాహిల్స్‌ రోడ్డు నం.14లోని 4865 గజాల ప్రభుత్వ స్థలంపై సయ్యద్‌ అబ్దుల్‌ ఖలీద్‌ కన్నుపడింది. Also Read: దీంతో ఆ స్థలం తన పేరిట ఉన్నట్లు నకిలీ పత్రాలు క్రియేట్ చేసి.. ఈ భూమిపై ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు లంచం అడుగుతున్నారని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసు పరిష్కారానికి రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా షేక్‌పేట్‌ ఆర్‌ఐ నాగార్జునరెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇదే కేసులో ఎస్సై రవీంద్రనాయక్‌, తహసీల్దార్‌ సుజాత సైతం అరెస్ట్ అయ్యారు. Also Read: అయితే దర్యాప్తులో భాగంగా ఖలీద్‌ సమర్పించిన భూమి పత్రాలను పరిశీలించిన ఏసీబీ అధికారులు అవి నకిలీవని గుర్తించారు. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఏసీబీ అధికారులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీసీఎస్‌ ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించి ఖలీద్‌తో పాటు అతడి లీగల్ అడ్వజైర్ అశోక్‌రెడ్డిని ఆదివారం అరెస్టు చేశారు. ఈ ఇద్దరిపై గతంలోనూ అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By August 10, 2020 at 09:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/banjarahills-land-grabing-case-hyderabad-ccs-police-arrests-two-accused/articleshow/77455441.cms

No comments