Breaking News

ఐదు నెలల తర్వాత తెరుచుకున్న వైష్ణోదేవి ఆలయం.. రోజుకు 2వేల మందికి మాత్రమే అనుమతి


కోవిడ్ కారణంగా దాదాపు ఐదు నెలల నుంచి మూసివేసిన జమ్మూ కశ్మీర్‌లోని ఆదివారం తెరుచుకుంది. అమ్మవారి దర్శనానికి భక్తులను ఆదివారం నుంచి అనుమతిస్తున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రోజుకు కేవలం 2,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామమని ఆలయ కార్యనిర్వహణాధికారి రమేశ్ కుమార్ తెలిపారు. వీరిలో స్థానికులు 1,900 మంది, ఇతర ప్రాంతాలవారు 100 మందికి అవకాశం ఉంటుందని వివరించారు. పరిస్థితి సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటాని వివరించారు. జమ్మూ కశ్మీర్‌లో ఆధ్యాత్మిక, మతపరమైన ప్రదేశాలను తెరవడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. వైష్ణోదేవి ఆలయంలో దర్శనాలకు కూడా మార్గదర్శకాల్లో పేర్కొంది. వైష్ణోదేవి ఆలయం సహా ఛారర్ ఇ షరఫ్, హజరత్బల్, నాంగాలీ షాహీబ్, షాహదార్ షరీఫ్, శివ్ ఖోరీ తదితర ప్రార్ధనా మందిరాల సందర్శనకు అనుమతించింది. అయితే, 10ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటినవారు, గర్భిణీలను దర్శనానికి అనుమతించబోమని తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా భక్తులు పేర్లును నమోదుచేసుకోవాలి. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకుని, నెగెటివ్ వచ్చినవారిని అనుమతిస్తామని స్పష్టం చేసింది. అలాగే, జమ్మూ కశ్మీర్‌లోని రెడ్ జోన్ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. భవన్ కాంప్లెక్స్‌లోకి యాత్రికులు, ఆలయ, భద్రత సిబ్బంది 600 మంది మించకూడదని, ఆలయంలోనూ మూడు గజాల దూరం పాటించాలని సూచించారు.


By August 16, 2020 at 12:23PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mata-vaishno-devi-temple-reopen-for-public-today-nearly-5-months-after-suspended-due-to-covid-19/articleshow/77571256.cms

No comments