Breaking News

పెళ్లైన 20 రోజులకే యువకుడి ఆత్మహత్య.. అన్నదమ్ములపై భార్య ఫిర్యాదు


పెళ్లయిన 20 రోజులకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా మండలంలో జరిగింది. మండలంలోని మహరాజుపేట గ్రామానికి చెందిన ఈగల నర్సింహులు (35)కు, గజపతినగరం మండలం ఎం.గుమడాం గ్రామానికి చెందిన కుమారితో 20 రోజుల క్రితం వివాహమైంది. రెండ్రోజుల క్రితం భార్యను పుట్టింట్లో వదిలి వచ్చిన నర్సింహులు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. Also Read: భర్త మరణ వార్త విని షాకైన కుమారి వెంటనే అత్తింటికి చేరుకుంది. అతడిది ఆత్మహత్య కాదని, అన్నదమ్ములతో ఆస్తి గొడవల కారణంగానే అతడు చనిపోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. దీనిపై భోగాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By August 20, 2020 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-man-commits-suicide-in-vizianagaram-district-wife-complaints-to-police/articleshow/77647384.cms

No comments