కర్నూలు: ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం.. 14ఏళ్ల బాలుడిపై పోక్సో కేసు

నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలులోని ఓ కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలుడు స్థానికంగా ఉండే ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక ఒంటరిగా ఆడుకుంటున్న సమయంలో గమనించిన బాలుడు ఆమెను పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. అయితే బాలిక కేకలు వేయడంతో కంగారుపడి ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. Also Read: ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు షాకయ్యారు. ఈ ఘటనపై కర్నూలు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరాలు సేకరించిన పోలీసులు బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మైనర్ కావడంతో పోలీసులు అతడికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియజేయడం లేదు. దీనిపై పూర్తిస్థాయిగా విచారణ చేపడతామని వెల్లడించారు. Also Read:
By August 19, 2020 at 08:51AM
No comments