Breaking News

వీడిన ఎస్‌బీఐ ఉద్యోగి మర్డర్ మిస్టరీ.. ప్రియుడితో కలిసి రెండో భార్య ఘాతుకం


నారాయణఖేడ్‌ ఎస్‌బీఐ ఏడీబీ శాఖలో సీనియర్‌ హెడ్‌ మెసెంజర్‌గా పనిచేస్తున్న వైపీ.మునుస్వామి(55) అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఆయన రెండో భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మునుస్వామి 30 ఏళ్లుగా ఖేడ్‌లోని ఎస్‌బీఐ బ్రాంచిలో పనిచేస్తున్నారు. పట్టణంలోని భవానీ కాలనీలో సొంతిల్లు కట్టుకున్నారు. 2015లో భార్య అనారోగ్యంతో చనిపోవడంతో 2016లో మన్సూర్‌పూర్‌కు చెందిన సంతుబాయి అనే మహిళను 2016, ఏప్రిల్‌లో కర్ణాటకలోని బీదర్‌ నర్సింహాస్వామి ఆలయంలో రెండో వివాహం చేసుకున్నారు. Also Read: మునుస్వామి ఆస్తిపై కన్నేసిన సంతబాయి భవానీ నగర్‌లోని ఇంటిని తన పేరు మీద రాయాలని ఒత్తిడి చేస్తూ వస్తోంది. దీనిపై దంపతుల మధ్య అనేకసార్లు గొడవుల జరిగాయి. ఈ క్రమంలోనే సంతబాయి నసీయర్‌మియా అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఆఫీసుకు వెళ్లిన సమయంలో ప్రియుడిని రప్పించుకుని రాసలీలలు కొనసాగించేది. తన భర్తను చంపేస్తే తమ బంధానికి అడ్డు తొలగడంతో పాటు ఆస్తి కూడా దక్కుతుందని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఈనెల 4న అర్ధరాత్రి సంతుబాయి ఫోన్‌ చేసి ప్రియుడిని ఇంటికి రప్పించింది. గాఢనిద్రలో ఉన్న మునుస్వామిని ఇద్దరు కలిసి చున్నీతో గొంతు బిగించారు. Also Read: నిద్రలో నుంచి మేల్కొని తప్పించుకునేందుకు ప్రయత్నించిన మునుస్వామిని నసీయర్‌మియా ఇనుపసుత్తితో తలపై బలంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎవరూ గుర్తపట్టకుండా గదిలోని రక్తపు మరకలు శుభ్రం చేసేశారు. తెల్లవారాక తన భర్త బాత్‌రూమ్‌కి వెళ్లి కాలుజారి చనిపోయాడని సంతబాయి కట్టుకథ అల్లింది. ఆదోనిలో ఉంటున్న మునుస్వామి మొదటి భార్య కొడుకు నర్సింహులు తండ్రిని కడసారి చూసేందుకు వచ్చాడు. తలపై బలమైన గాయాన్ని గుర్తించిన అతడు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సంతుబాయి, నసీర్‌మియా దొరికిపోతామన్న భయంలో మంగళవారం ఉదయం బీదర్‌కు పారిపోవడానికి ఖేడ్‌లోని సత్యనారాయణస్వామి మందిరం వద్ద నిలబడి ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తామే మునుస్వామిని చంపినట్లు అంగీకరించడంతో వారిపై హత్యకేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By July 08, 2020 at 08:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/wife-killed-husband-due-to-her-illegal-affair-in-narayanakhed-in-sangareddy-district/articleshow/76845764.cms

No comments