Breaking News

యూపీ: దుండగుల కాల్పుల్లో గాయపడిన జర్నలిస్ట్ మృతి


సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యూపీకి చెందిన బుధవారం ఉదయం హాస్పిటల్‌లో మృతిచెందాడు. తన కుమార్తెలతో కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్న జోషిపై.. ఆయన ఇంటికి సమీపంలోనే దుండగులు కాల్పులు జరిపారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జోషిని వైద్యం కోసం సమీపంలోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకోగా.. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. తన మేనకోడలను కొందరు యువకులు వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల తరువాత విక్రమ్ జోషిపై దాడి జరిగింది. ఘజియాబాద్‌లోని విజయ్‌నగర్ వద్ద సోమవారం రాత్రి జర్నలిస్ట్ విక్రమ్ జోషిని అడ్డుకుని, చుట్టుముట్టినట్టు సీసీటీవీ దృశ్యాలు స్పష్టం చేస్తున్నారు. బైక్‌పై ఉన్న జోషిని కిందకు లాగి, దాడిచేయగా, ఆయన పిల్లలు ఇద్దరూ అక్కడ నుంచి పరుగులు పెడుతుండగా...దాడికి పాల్పడిన నిందితులు విక్రమ్ జోషిని కారు వైపునకు లాక్కెళ్లి, అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ముందు కొట్టినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లు గుర్తించారు. తీవ్ర గాయాలతో కింద పడిపోయిన తండ్రిని చూసి పెద్దగా ఏడుస్తూ సాయం చేయమంటూ ఆయన కుమార్తె అర్ధించింది. జర్నలిస్ట్‌ హత్యాయత్నం ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. ‘యూపీలో శాంతి భద్రతల పరిస్థితికి ఘజియాబాద్ ఘటన అద్దం పడుతోంది.. తన మేనకోడల్ని వేధిస్తున్నారని ఓ జర్నలిస్ట్.. పోలీసులకు ఫిర్యాదుచేసినందుకు కాల్పులకు తెగబడ్డారు.. న్యాయం అరణ్య రోదనగా ఉంటే సాధారణ పౌరుడికి రక్షణ ఏది’అని వ్యాఖ్యానించారు.


By July 22, 2020 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/uttar-pradesh-journalist-shot-in-head-in-front-of-his-daughters-near-delhi-dies/articleshow/77100949.cms

No comments