Breaking News

దేశంలో మరింత ఉద్ధృతంగా మహమ్మారి.. పాజిటివ్ కేసుల్లో గురువారం మరో రికార్డు


దేశంలో మరింత ఉద్ధృతంగా ఉంది. కేవలం రెండు రోజుల్లో 50వేలకుపైగా కేసులు నమోదుకావడం దేశంలో వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. రోజూ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఏకంగా 26వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం నాటి అత్యధిక కేసుల రికార్డు కనుమరుగయ్యింది. దేశవ్యాప్తంగా మరో 471 మంది కరోనాకు బలయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా వైరస్ కేసుల సంఖ్య 794,842కి చేరగా.. మరణాలు 21,677కి చేరాయి. అయితే, ఇప్పటి వరకూ 4.96 లక్షల మంది కరోనా బాధితులు కోలుకోగా.. మరో 2.78 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం దేశవ్యాప్తంగా 18,572 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో గురువారం నాటి 17,870 కేసుల రికార్డును అధిగమించింది. గత ఎనిమిది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదుకావడం దేశంలో వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 5,000కుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 152,765కి చేరాయి. మరో 175 మంది శుక్రవారం ప్రాణాలు కోల్పోవడంతో మహారాష్ట్రలో కరోనా మరణాలు 7,106కి చేరాయి. ఒక్క ముంబయిలోనే 119 మంది బలయ్యారు. గతవారంతో పోలిస్తే మరణాల రేటు కొంచెం తక్కువగా నమోదయ్యింది. జులై 3 నుంచి 9 వరకు రోజుకు సగటున 485 మరణాలు చోటుచేసుకోగా.. ఈ వారం అది 385గా నమోదయ్యింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో గురువారం 6,875 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. తర్వాత తమిళనాడు (4,231), కర్ణాటక (2,228), ఢిల్లీ (2,187), ఆంధ్రప్రదేశ్ (1,555), తెలంగాణ (1,410), బెంగాల్ (1,088), గుజరాత్ (861), ఒడిశా (577) పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాల సంఖ్య 2వేలు దాటిన రాష్ట్రంగా మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత గుజరాత్ నిలిచింది. బెంగళూరు నగరంలో గురువారం 1,373 కొత్త కేసులు నమోదుకాగా.. ముంబయిలో 1,268, చెన్నైలో 1,216 కొత్త కేసులు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,555 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీరిలో స్థానికంగా 1,500 కేసులు నమోదయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారిలో 53, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరు కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,814కి చేరింది. కొవిడ్‌ బారిన పడి మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 277కు చేరింది. మరణాల శాతం 1.66%గా ఉంది. తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. గురువారం 1,410 కేసులు నమోదు కాగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 918 కేసులు గుర్తించారు. రంగారెడ్డి పరిధిలో 125, మేడ్చల్‌లో 67, సంగారెడ్డిలో 79 మందికి కరోనా సోకినట్లు బులిటెన్‌‌లో పేర్కొన్నారు. కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 331కి చేరింది. రాష్ట్రంలో మొత్తం 30,946 పాజిటివ్‌ కేసులకు గానూ..12,423 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


By July 10, 2020 at 07:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-another-one-day-high-with-26550-new-cases-in-india/articleshow/76884532.cms

No comments