Breaking News

అఫైర్‌కు అడ్డొస్తోందని భార్య గొంతు నులిమి హత్య.. కృష్ణా జిల్లాలో దారుణం


కంకిపాడు మండలంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను చంపేశాడు. ఉప్పులూరు ఎస్సీ కాలనీకి చెందిన కోటేశ్వరరావుకి పెదపారుపూడి మండలం మోపర్రుకు చెందిన మహిళ(40)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కోటేశ్వరరావు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో పెట్టుకున్నాడు. Also Read: ఈ విషయం ఇటీవల తెలుసుకున్న భార్య అతడిని నిలదీసింది. దీనిపై కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ప్రియురాలి దగ్గరకు వెళ్తున్న కోటేశ్వరరావును భార్య నిలదీసింది. దీనిపై గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన అతడు భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటనపై స్థానికులు మృతురాలి సోదరుడికి సమాచారం ఇవ్వగా అతడు వెంటనే అక్కడకి చేరుకున్నాడు. గురువారం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read:


By July 24, 2020 at 11:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-over-illegal-affair-in-krishna-district/articleshow/77141790.cms

No comments