Breaking News

ఏలూరు: కోవిడ్ సెంటర్‌ నుంచి ఇద్దరు ఖైదీల పరార్


కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లుగప్పి పరారైన ఘటన జిల్లా ఏలూరులో వెలుగుచూసింది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న 13 మంది ఖైదీలకు ఇటీవల కరోనా వైరస్ సోకింది. దీంతో వీరిని సీఆర్ఆర్ కోవిడ్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన ఇద్దరు ఖైదీలు శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో అక్కడి నుంచి పరారయ్యారు. Also Read: దీంతో షాకైన సిబ్బంది వెంటనే ఏలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఖైదీలు ఎలా తప్పించుకున్నారో విశ్లేషించారు. పరారైన ఇద్దరూ అనేక చోరీల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఈ ఘటనతో కోవిడ్ సెంటర్‌ వద్ద పోలీసులు బందోబస్తు పెంచారు. మిగిలిన ఖైదీలు పరారు కాకుండా కట్టుదిటమైన చర్యలు తీసుకున్నారు. Also Read:


By July 25, 2020 at 10:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-prisoners-escaped-from-covid-centre-in-eluru-west-godavaru/articleshow/77163096.cms

No comments