Breaking News

చిరంజీవి ఎందుకలా సైలెంట్ అయ్యారు? ఆ మౌనానికి కారణం ఏంటి? ముదురుతున్న చర్చ..


లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చానని సోషల్ మీడియాలో అడుగుపెట్టగానే రుజువు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఓపెన్ చేసి సమాజంలోని అన్ని విషయాలపై స్పందిస్తూ, తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు చిరు. అలా నిత్యం తన ట్వీట్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా గత 20 రోజులుగా మాత్రం ట్విట్టర్ పిట్ట మూగబోయింది. ఆయన వాల్ నుంచి ఒక్క ట్వీట్ కూడా బయటకు రాకపోవడంతో జనాల్లో చర్చలు మొదలయ్యాయి. కరోనా విలయతాండవంలో నేనున్నా అంటూ సీసీసీ బాధ్యతలు భుజాన వేసుకున్న చిరంజీవి.. ఉపాధి లేక అల్లాడిపోతున్న సినీ కార్మికులకు అండగా నిలిచారు. ఆ విశేషాలను ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేశారు. ఆ తర్వాత సినిమా షూటింగ్స్ ప్రారంభ నిమిత్తం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి అనుమతులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మధ్యలోనే బాలకృష్ణ ఎంటర్ కావడం, ఓ ఇష్యూ జరగడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. Also Read: కాగా తీరా షూటింగ్ అనుమతులు మంజూరయ్యాక సినిమావాలెవ్వరూ సెట్స్ మీదకు రావడానికి ధైర్యం చేయడం లేదు. మరోవైపు చిరంజీవి కూడా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండటం లేదు. దీంతో మొదట్లో తన సందేశాలతో రఫ్ఫాడించిన చిరు.. ఇప్పుడేంటి ఇలా సైలెంట్ అయ్యారనే కోణంలో చర్చలు ముదిరాయి. ఈ మౌనం వెనుక కారణం ఏమై ఉంటుంది? అని అన్వేషిస్తున్నాయి సినీ వర్గాలు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సలహాలు, సూచనలు అవసరం కాబట్టి ఆయన తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలనే అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. చూడాలి మరి చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతారో!.


By July 11, 2020 at 09:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-not-active-in-twitter-account-netijans-requested-to-megastar/articleshow/76904198.cms

No comments