Breaking News

Sarkaru Vaari Paata: రెమ్మ్యూనరేషన్ తగ్గించుకున్న డైరెక్టర్ పరశురామ్.. కారణమిదే!


సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమా ''. ఇటీవలే ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది చిత్రయూనిట్. అప్పటినుంచే ఈ మూవీ గురించిన వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ రెమ్మ్యూనరేషన్ తాలూకు వివరాలు బయటకొచ్చాయి. మహేష్ బాబును ఫైనల్ అవుట్‌పుట్‌తో మెప్పించిన పరశురామ్ 10 కోట్ల రెమ్మ్యూనరేషన్ అందుకోనున్నట్లు విన్నాం. అయితే తాజా సమాచారం మేరకు పరశురామ్.. తన పారితోషికాన్ని తగ్గించుకున్నారని తెలుస్తోంది. కరోనా విలయతాండవానికి సినీ పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అయింది. షూటింగ్స్ లేక సినీ వర్గాలు ఆర్ధికంగా కుదేలైపోయాయి. ముఖ్యంగా నిర్మాతలు బాగా నష్టపోయారు. అనుకున్న సినిమాలు సెట్స్ మీదకు రాక, సగం పూర్తిచేసిన సినిమాలను కంప్లీట్ చేయలేక ఆర్ధిక భారంతో సతమతమవుతున్నారు. మహేష్.. 'సర్కార్ వారి పాట' కూడా ఇప్పట్లో సెట్స్ మీదకు వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఈ పరిస్థితులు చూసిన పరశురామ్ తన రెమ్మ్యూనరేషన్ తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారట. Also Read: ఈ క్రమంలోనే తన పారితోషికాన్ని 10 కోట్ల నుంచి 7 కోట్లకు ఆయన కుదించుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా పరిస్థితుల్లో నిర్మాతల బాగోగులే ముఖ్యమని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్త సమర్పణలో రూపొందనున్న 'సర్కార్ వారి పాట' సినిమాకు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ని హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.


By June 13, 2020 at 10:04AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-parasuram-decides-to-reduced-his-remuneration-for-sarkaru-vaari-paata/articleshow/76352137.cms

No comments