Breaking News

Sarkar Vaari Paata: నమ్రతా శిరోద్కర్ క్లోజ్ కాబట్టే ఆ రూమర్స్.. సాయి మంజ్రేకర్ రియాక్షన్


ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' సూపర్ సక్సెస్‌తో తన అభిమానుల్లో నూతనోత్సాహం నింపిన .. తన తదుపరి సినిమా ''ను పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టు వివరాలు అఫీషియల్‌గా ప్రకటించిన చిత్రయూనిట్.. ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సూపర్ స్టార్ అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టి 'సర్కార్ వారి పాట'పై పడింది. ఈ మూవీ హీరోయిన్, ఇతర నటీనటుల విషయమై వార్తలు ఊపందుకున్నాయి. Also Read: ఈ క్రమంలోనే 'సర్కార్ వారి పాట'లో మహేష్ బాబు సరసన స్టార్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ కూతురు, ‘దబాంగ్ 2’ ఫేమ్ సాయి మంజ్రేకర్‌ని హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు చెప్పుకున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాగానే ఆమె సెట్స్ మీదకు రానుందని టాక్ నడించింది. ఈ నేపథ్యంలో ఓ మీడియాతో మాట్లాడిన సాయి మంజ్రేకర్.. అట్టి వార్తలను కొట్టిపారేసింది. మహేష్ బాబు సినిమాలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. తనకు 'సర్కార్ వారి పాట' నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదని చెప్పింది సాయి మంజ్రేకర్. ఒకవేళ అలాంటి ఆఫర్ వచ్చినా అప్పటి పరిస్థితులను బట్టి ఆలోచిస్తా కానీ ఇప్పుడైతే ఏమీ చెప్పలేనని పేర్కొంది. అయితే నమ్రతా శిరోద్కర్ తమ ఫ్యామిలీకి క్లోజ్ కాబట్టే ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు రూమర్స్ పుట్టుకొచ్చాయని, అంతకుమించి ఏమీ లేదని భావిస్తున్నానని సాయి మంజ్రేకర్ వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. కరోనా కారణంగా రెగ్యులర్ షూట్‌కి వెళ్లడం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‌


By June 16, 2020 at 07:54AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/saiee-manjrekar-reaction-on-romance-with-mahesh-babu/articleshow/76396840.cms

No comments