Breaking News

కృష్ణా జిల్లాలో యువకుడి దారుణహత్య.. అర్ధరాత్రి సైకిల్‌పై వెళ్తుండగా దారికాచి


కృష్ణా జిల్లా మండలం మునగచర్ల గ్రామానికి చెందిన గంటా నవీన్‌ (27) అనే విలేకరి దారుణ హత్యకు గురయ్యాడు. ఈనెల 14వ తేదీ రాత్రి కనిపించకుండా పోయిన నవీన్ శనివారం సాయంత్రం నందిగామలోని కాకతీయ పాఠశాల రోడ్డు చివరిలో ఉన్న ఖాళీ స్థలంలో విగతజీవిగా కనిపించాడు. నవీన్ కొంతకాలంగా క్రైమ్ ఇండియా రిపోర్టింగ్‌ పేరిట వాట్సాప్‌ గ్రూపును నిర్వహిస్తూ నందిగామ ప్రాంతంలోని అనేక వివాదాస్పద అంశాలు, అక్రమాలపై పోస్టింగ్‌లు పెడుతుండేవాడు. దీంతో అనేక మంది ఫిర్యాదులు చేయడంతో పోలీసులు అతడిపై రౌడీషీట్‌ తెరిచారు. Also Read: 14వ తేదీ నుంచి నవీన్ కనిపించకపోవడంతో అతడి తల్లి అలివేలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సీఐ కనకారావు, ఎస్సై ఏసోబు కేసు నమోదు చేసి అనుమానితులను విచారించారు. ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారంతో డీఎస్పీ, తహసీల్దారు చంద్రశేఖర్‌ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించి మార్చురీకి తరలించారు. నందిగామకు చెందిన గోనెల సాయితో నవీన్‌కు వ్యక్తిగత కక్షలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 14వ తేదీ రాత్రి నవీన్‌ సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా పట్టణ శివారు అనాసాగరం వద్ద సాయి, కె.రమణ అడ్డగించి సెల్‌ఫోన్‌లో ఫొటోలు ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించారు. కోపంతో వారిద్దరు నవీన్‌ తలపై బండరాయితో మోది చంపేశారు. Also Read: అనంతరం నవీన్‌ మృతదేహాన్ని సంఘటన స్థలంలోనే పూడ్చిపెట్టిన నిందితులు.. 18వ తేదీ తెల్లవారుజామున వెలికితీసి సాయి ఇంటి వెనుక భాగంలోని ఖాళీస్థలంలో పూడ్చిపెట్టారు. నవీన్‌ మృతి విషయం తెలుసుకున్న తల్లి, సోదరి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసును పూర్తి స్థాయిలో విచారణ చేసి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. స్థానికంగా జరిగే అనేక అక్రమాలను వెలుగులోకి తెస్తున్నాడన్న కక్షతోనే నవీన్‌ను చంపేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. Also Read:


By June 21, 2020 at 11:09AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-brutally-murdered-in-krishna-district/articleshow/76490406.cms

No comments