Breaking News

టోల్‌ఫీజు తప్పించుకునేందుకు పోలీస్ వేషం.. కోనసీమ కుర్రోడి అతితెలివి


జాతీయ రహదారిపై టోల్‌ ఫీజు తప్పించుకునేందుకు నకిలీ పోలీస్ అవతారమెత్తిన ఓ యువకుడు అడ్డంగా దొరికిపోయిన ఘటన బుధవారం విజయవాడలో జరిగింది. ‘నేను తెలంగాణలో పోలీసుగా పనిచేస్తున్నా. నా వాహనాన్ని తనిఖీ చేయనక్కర్లేదు. వెంటనే పంపించేయండి’.. అంటూ మస్కా కొట్టాడు. అతడిపై అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా ఆ కేటుగాడి బండారం బయటపడింది. వెస్ట్‌జోన్ ఏసీపీ సుధాకర్‌ గురువారం భవానీపురం పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఘటన తాలూకు వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పట్టణానికి చెందిన గుత్తుల ప్రశాంత్‌ (28) హైదరాబాద్‌లో స్థిరపడి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కరస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు. Also Read: బుధవారం స్వస్థలానికి వెళ్లేందుకు కారులో బయలుదేరాడు. విజయవాడ నగర సమీపంలోని గొల్లపూడి వన్‌ సెంటర్‌ వద్దకు వచ్చేసరికి స్థానిక ఎస్‌ఐ ఇజ్రాయెల్‌, సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో పోలీసు బోర్డుతో ఉన్న ప్రశాంత్‌ కారును కూడా తనిఖీ చేసి రికార్డులు చూపించాలని కోరారు. తాను సైబరాబాద్‌ పోలీసుస్టేషన్‌‌లో ఎస్‌ఐగా పని చేస్తున్నానని, తన వాహనాన్ని తనిఖీ చేయాల్సిన అవసరం లేదని ప్రశాంత్ చెప్పాడు. వారికి ఐడీ కార్డు చూపించగా అందులో ఫోటో సైజ్ పెద్దగా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఎస్ఐ ఇజ్రాయెల్ గట్టిగా నిలదీయడంతో తాను యూట్యూబ్ ఛానల్ కరస్పాండెంట్‌నంటూ మరో ఐడీ కార్డు చూపించాడు. Also Read: పోలీసుల కారు నంబర్ పరిశీలించగా అది కూడా మార్చేసి ఉంది. ఏపీకి చెందిన కారుకు నంబరుగా మార్చాడు. అతడి అతితెలివికి షాకైన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని భవానీపురం పీఎస్‌కు తరలించారు. అతడిని విచారించగా.. హైవేపై టోల్‌ ఫీజులు, వాహనాల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఇలా చేసినట్లు అంగీకరించాడు. అయితే ప్రశాంత్ పోలీసు పేరుతో గతంలో ఏమైనా బెదిరింపులకు, మోసాలకు పాల్పడ్డాడా..?అనే కోణంలో విచారణ చేస్తున్నట్లుగా ఏసీపీ తెలిపారు. ప్రశాంత్‌ను చాకచక్యంగా పట్టుకున్న సీఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ ఇజ్రాయెల్‌ను ఏసీపీ అభినందించారు. Also Read:


By June 26, 2020 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vijayawada-police-arrested-fake-police-who-travelled-from-hyderabad-to-konaseema/articleshow/76636684.cms

No comments