Breaking News

నవంబరు మధ్యనాటికి కోవిడ్ మరింత ఉద్ధృతం... ఐసీఎంఆర్ స్టడీ


దేశంలో తొలి కేసు జనవరి 30న నమోదు కాగా.. అప్పటి నుంచి మెల్లగా పాజిటివ్ కేసులు పెరుగుతూ వచ్చాయి. మార్చి నాటికి కేసులు వందలకు చేరడంతో మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో దేశంలో కరోనా వైరస్ విజృంభణకు తాత్కాలికంగా అడ్డుకట్టపడింది. ఈ సమయంలో వైద్య ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరుచుకోడానికి భారత్‌కు వెసులుబాటు లభించింది. కాగా, దేశంలో కరోనా వైరస్ నవంబరు మధ్యనాటికి అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ () ఓపెన్ యాక్సిస్ సర్వే నిర్వహించి నివేదికను అందజేసింది. ఐసీఎంఆర్ ఏర్పాటుచేసిన ఆపరేషన్స్ రిసెర్చ్ గ్రూప్ పరిశోధకులు ఈ సర్వేను నిర్వహించారు. అధ్యయనం ప్రకారం.. మహమ్మారి తీవ్రతను లాక్‌డౌన్ 34 నుంచి 76 రోజుల వరకు తగ్గించి, కోవిడ్ -19 వక్రతను సున్నితం చేసినట్టు అంచనా వేసింది. అంతేకాదు, అంటువ్యాధిని 69-97 శాతం తగ్గించడానికి సహాయపడింది..దీని వల్ల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు వనరులు, మౌలిక సదుపాయాలను కల్పించడానికి సమయం లభించింది. అధ్యయనంలో లోపాలు ఉన్నాయని, వీటిని ఐసిఎంఆర్ ధ్రువీకరించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు మే 6 నాటికి ఆరు వారాల లాక్‌డౌన్ ముగిసిన తరువాత.. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,29,872కి చేరుతాయని అంచనా వేసింది. అయితే, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం దేశంలో ఇప్పటి వరకూ 3.32 లక్షల కేసులను మాత్రమే నమోదయ్యాయి, ఇది అధ్యయనంలో పేర్కొన్న దానికంటే చాలా తక్కువ. ప్రజారోగ్య నిఘా చర్యలను 60 శాతం మేర మెరుగుపడినట్టు అధ్యయనం తెలిపింది. తీవ్రమైన ప్రజారోగ్య చర్యలతో ఐసీయూలు, వెంటిలేటర్ల అవసరం 83 శాతం తగ్గుతుందని పేర్కొంది.


By June 15, 2020 at 09:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-to-see-coronavirus-peak-by-mid-nov-says-icmr-funded-study/articleshow/76378859.cms

No comments