Breaking News

కామదాహానికి బాలిక బలి.. అవమానంతో ఆత్మహత్య.. అత్యంత దారుణ ఘటన


కామపిశాచాలు మరోసారి రెచ్చిపోయాయి. నీళ్ల కోసం పంపు దగ్గరికెళ్లిన బాలికని కామాంధులు బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. పశువుల్లా మీద పడి కామవాంఛ తీర్చుకున్నారు. అదేంటని ప్రశ్నించినందుకు తండ్రిపై దాడి చేసి దుర్భాషలాడారు. అవన్నీ చూసి తట్టుకోలేకపోయిన బాధితురాలు అవమానభారంతో అఘాయిత్యానికి ఒడిగట్టింది. బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ అత్యంత విషాద ఘటన యూపీలో చోటుచేసుకుంది. జిల్లా కసిమాబాద్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) నీళ్ల కోసం పంపు వద్దకెళ్లింది. అది గమనించిన పక్కింటి వ్యక్తి మునీష్ చౌహాన్ ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు. అదే గ్రామానికి చెందిన ఘన్‌శ్యామ్ యాదవ్‌కి చెందిన ట్రక్కులో పడేశాడు. ఇద్దరూ కలిసి పశువుల్లా ఆమెపై పడి దారుణంగా అత్యాచారం చేశారు. ట్రక్కులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితురాలు ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆగ్రహం చెందిన తండ్రి నిలదీసేందుకు చౌహాన్ ఇంటికెళ్లాడు. చౌహాన్, అతని కుటుంబ సభ్యులు ఎదురుదాడి చేయడంతో పాటు ఎక్కడైనా చెబితే దారుణ పరిస్థితులు ఎదుర్కొంటారంటూ బెదిరింపులకు దిగారు. తీవ్రంగా దుర్భాషలాడుతూ అవమానపరిచారు. Also Read: దిక్కుతోచని స్థితిలో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అత్యాచారం, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఘన్‌శ్యామ్‌ని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు చౌహాన్ పరారీలో ఉన్నాడు. బాలికను వైద్య పరీక్షలకు తీసుకెళ్లేందుకు పోలీసులు ఇంటికి వచ్చారు. అప్పటికే అవమాన భారంతో కుంగిపోయిన బాలిక.. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్యతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితులను తక్షణం అరెస్టు చేయాలని.. కఠినంగా శిక్షించాలంటూ నిరసనకు దిగారు. విషయం సీరియస్ కావడంతో పోలీసులను భారీగా మోహరించారు. జిల్లా ఎస్పీ గ్రామానికి వచ్చి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని హామీ ఇవ్వడంతో శాంతించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. Read Also:


By June 20, 2020 at 12:56PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/gangrape-victim-hangs-self-in-ups-ghazipur/articleshow/76478680.cms

No comments